అమ్మకు కష్టమొచ్చింది.. ఆపద తలపెట్టింది
అమ్మ తీసుకెళ్తుంటే పొలాల్లో ఆడుకోవడానికి అనుకున్నారా పిల్లలు. బావి ఒడ్డున నిలబెట్టి చూపుతుంటే నీళ్ల లోతు గురించి చెబుతోందని భావించారు.
కుమార్తె, కుమారుడితో కలిసి బావిలోకి దూకిన తల్లి
ఇద్దరి మృత్యువాత.. ముళ్లపొద పట్టుకుని బయటపడిన తనయుడు
పుణ్యమ్మ సంగీత
న్యాల్కల్(జహీరాబాద్ అర్బన్), న్యూస్టుడే: అమ్మ తీసుకెళ్తుంటే పొలాల్లో ఆడుకోవడానికి అనుకున్నారా పిల్లలు. బావి ఒడ్డున నిలబెట్టి చూపుతుంటే నీళ్ల లోతు గురించి చెబుతోందని భావించారు. కానీ అమ్మకొచ్చిన కష్టంతో ప్రాణాలు తీసుకునేందుకు తమను వెంట తీసుకొచ్చిందని పసిగట్టలేక పోయారు. ‘తాను లేని లోకంలో తన బిడ్డలు బాధలు పడకూడదని’ భావించిన ఆ తల్లి కుమార్తె, కుమారుడితో కలిసి బావిలోకి దూకేందుకు సిద్ధమైంది. అంచులో నిలబడి దూకడానికి యత్నిస్తుండగా కుమారుడు ఒడ్డున ఉన్న ముళ్లచెట్టును పట్టుకోవడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాంతీర్థ్లో చోటుచేసుకుంది. హద్నూర్ ఎస్సై వినయ్కుమార్, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంతీర్థ్ గ్రామానికి చెందిన తెనుగు మల్లేశం, పుణ్యమ్మ(36) దంపతులకు కుమార్తె సంగీత(9), రాము(7) సంతానం. మానసికస్థితి సరిగాలేని మల్లేశం భార్యతో తరచూ గొడవలు పడేవాడు. ఇటీవల మద్యానికి బానిసై రోజూ వివాదానికి దిగుతున్నాడు. పుణ్యమ్మ బుధవారం సాయంత్రం పిల్లలతో కలిసి పొలిమేరలోని వ్యవసాయ బావిలో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది. దూకే క్రమంలో రాము ముళ్లపొదను పట్టుకున్నాడు. పుణ్యమ్మ, సంగీత నీళ్లలో పడిపోయారు. చిన్నారి వెంటనే ఊళ్లోకి వెళ్లి గ్రామస్థులకు చెప్పాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జహీరాబాద్ అగ్నిమాక శకటాన్ని రప్పించి నిచ్చెన, ఈతగాళ్ల సాయంతో తల్లీకూతుళ్ల మృతదేహాలను వెలికితీయించి జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆవేదనాభరితంగా రాము
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
తాండూరు, బషీరాబాద్, న్యూస్టుడే: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. బషీరాబాద్- ఇందర్చేడ్ మార్గంలో ఈ ఘటన జరిగింది. తాండూరు డిపో మేనేజరు సమత తెలిపిన ప్రకారం సంగెం కలాన్ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ (38) బుధవారం విధులకు వచ్చారు. అదేరోజు రాత్రి బషీరాబాద్ నుంచి ఇందర్చేడ్ గ్రామానికి వెళ్లేందుకు ప్రయాణికులకు టిక్కెట్లను ఇచ్చారు. పని పూర్తవడంతో డ్రైవర్తో మాట్లాడుతూనే ఉన్నట్టుండి గుండెపోటుకు గురై కింద పడిపోయారు. అదే బస్సులో అతడిని బషీరాబాద్, తాండూరు ఆసుపత్రులకు తరలించారు. అప్పటికే కండక్టర్ మృతి చెందాడని వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు బలవన్మరణం
పూడూరు, న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరుకు చెందిన జీవరత్నం(57) రైతు. ఆయనకు ఐదు ఎకరాల్లో మామిడి తోట ఉంది. తోట సంరక్షణకు ఇటీవల బ్యాంకుతోపాటు, ప్రైవేటుగా రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసేది లేక.. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
గజ్వేల్ గ్రామీణ, న్యూస్టుడే: పట్టణంలోని పిడిచేటు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. గజ్వేల్ ఠాణా సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాలు.. రాయపోల్ మండలం మంతూరుకు చెందిన తంగెళ్లపల్లి మురళీదాస్(22), నవీన్, భానుప్రసాద్ ద్విచక్రవాహనంపై గజ్వేల్కు వచ్చారు. బుధవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. పట్టణంలోని పిడిచేడు రోడ్డులో ముందు వెళుతున్న లారీ డ్రైవరు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ద్విచ్రవాహనం దాన్ని ఢీకొంది. ప్రమాదంలో తంగెళ్లపల్లి మురళీదాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
కంటెయినర్ ఢీకొని ఒకరు..
కోహీర్, న్యూస్టుడే: కంటెయినర్ ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా.. మరొకరికి గాయాలైన ఘటన మండలంలోని దిగ్వాల్లో చోటుచేసుకుంది. ఎస్సై వి.సురేష్ తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం కొత్తకోలుకుందకు చెందిన అర్షద్, జహీర్ స్నేహితులు. బుధవారం వీరిద్దరు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడెకన్నలో వివాహ వేడుకకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. 65వ నంబరు జాతీయ రహదారిపై దిగ్వాల్కు చేరుకోగానే ప్రధాన కూడలి వద్ద సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ ఢీకొంది. ఇరువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఇద్దరిని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్షద్(23) ప్రాణాలు విడిచాడు. మృతుని తండ్రి నిజాముద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
టీ తాగేందుకు రోడ్డు దాటుతూ మరొకరు..
శామీర్పేట, న్యూస్టుడే: కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట ఠాణా పరిధిలో బుధవారం జరిగింది. ఎస్సై మునీందర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పెద్ద రమేశ్(52) వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గిరాకీ నిమిత్తం నగరానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లి హెచ్పీ పెట్రోల్బంకు వద్ద చాయ్ తాగేందుకు ఆగారు. రాజీవ్ రహదారి దాటుతుండగా.. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలొదిలారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ‘గాంధీ’కి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
[ 10-05-2024]
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. -
343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
[ 10-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటెందుకు వేయాలంటే..
[ 10-05-2024]
ఎంత ఎక్కువ పోలింగ్ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్ నమోదవుతున్నా.. -
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!