నర్సాపూర్ ఖరారు.. మెదక్ తకరారు
ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల మాత్రమే గడువు ఉంది. షెడ్యుల్ వెలువడ్డాక రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. భాజపా నుంచి నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించగా, మెదక్ స్థానం పెండింగ్లో ఉంచారు.
న్యూస్టుడే, నర్సాపూర్, మెదక్
ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల మాత్రమే గడువు ఉంది. షెడ్యుల్ వెలువడ్డాక రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. భాజపా నుంచి నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించగా, మెదక్ స్థానం పెండింగ్లో ఉంచారు.
కండక్టర్ నుంచి ప్రస్థానం ప్రారంభం
నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్సాపూర్ పుర అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్యాదవ్ను ఖరారు చేశారు. ఇక్కడి నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేశ్గౌడ్, రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డిలు టికెట్ ఆశించారు. వీరిలో మురళీయాదవ్కే అవకాశం దక్కింది. ఈయన 1985-1995 వరకు ఆర్టీసీలో కండక్టర్గా పని చేశారు. ఈ సమయంలో సీపీఐ ఎమ్మెల్యే చిలుముల విఠల్రెడ్డి నర్సాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. 1995-2000 వరకు ఆ పదవిలో కొనసాగారు. అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రెండోసారి 2000-2005 వరకు సర్పంచిగా ఉన్నారు. 2014-2019 వరకు భారాస ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మురళీయాదవ్ కొనసాగారు. 2020లో నర్సాపూర్ పుర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2022 ఆగస్టులో భారాస అధిష్ఠానంపై అసమ్మమతి స్వరం వినిపించడంతో సస్పెండ్ చేశారు. ఆ తర్వాత భాజపాలో చేరారు. ఈటల రాజేందర్కు అనుచరుడిగా కొనసాగుతుండగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి పదవి దక్కింది. బీసీ గళం బలంగా వినిపించడంతో పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్ను కేటాయించింది.
మెదక్లో నలుగురి మధ్య పోటీ..
మెదక్ అభ్యర్థితత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు. పలువురు దరఖాస్తు చేసుకోగా అందులో నలుగురిని పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు పరిణిత, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్రెడ్డి, నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్లలో ఒకరికి టిక్కెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. మహిళ, బీసీ, రెడ్డి సామాజికవర్గం కోటాలో వీరి పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి మెదక్ ఎంపీగా పనిచేసిన అనుభవం, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆమెను మరోసారి బరిలో దింపాలని అధిష్ఠానం యోచిస్తోంది. రెండో జాబితాలో అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది.
వల్లూరులో మాట్లాడుతున్న రఘునందన్రావు
సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు
చేగుంట: దుబ్బాక భాజపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావు అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. టికెట్కు పలువురు దరఖాస్తు చేయగా, అధిష్ఠానం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపింది. ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. 2014, 2018లో దుబ్బాక నుంచి, 2019లో మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. భారాస కంచుకోట.. భాజపాలోకి వెళ్లింది.
అవకాశమిస్తే ఆదర్శంగా: రఘునందన్రావు
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే, భాజపా అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. ఆదివారం నార్సింగి మండలం వల్లూరులో భాజపా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పలువురు భారాస కార్యకర్తలు భాజపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేళ్లు ఎంపీగా ఉన్న ప్రభాకర్రెడ్డి దుబ్బాకకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. చేగుంట వైస్ ఎంపీపీ మున్నూరు చంద్రం, భాజపా నార్సింగి పట్టణ అధ్యక్షుడు శిర్న చంద్రశేఖËర్, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, బాల్రెడ్డి, నర్సింలు, చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు చింతాల భూపాల్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
[ 28-04-2024]
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
[ 28-04-2024]
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సదాశివపేట పట్టణంలో చోటుచేసుకొంది. -
లోక్సభ నియోజకవర్గ ఓటర్లు @ 18.28 లక్షలు
[ 28-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. -
ఎండ ప్రచండం.. ప్రచారానికి గండం!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది. -
భారాస హయాంలోనే తెలంగాణ అభివృద్ధి: పద్మ
[ 28-04-2024]
పద్నాలుగు ఏళ్ల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి...అన్ని రంగాలను ముందుకు నడిపి తొమ్మిదిన్నరేళ్లలో భారాస అధినేత కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా -
కాంగ్రెస్ను గెలిపిస్తేనే పురోగతి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. -
డార్మిటరీలో స్నేహం.. చోరీల వ్యూహం
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మిటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
వక్ఫ్బోర్డు స్థలాల్లో ఆగని ఆక్రమణల పర్వం
[ 28-04-2024]
రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్బోర్డుకు ఛైర్మన్ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా... -
తెలంగాణ గాంధీ కేసీఆర్: చింతా ప్రభాకర్
[ 28-04-2024]
ప్రాణాల సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ గాంధీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. -
పెరుగుతుందా.. తగ్గుతుందా..!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
కేసీఆర్ ఒక్కరే!
[ 28-04-2024]
గజ్వేల్ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉండేది. -
పోలింగ్ కేంద్రాలు.. సమగ్ర వివరాలు
[ 28-04-2024]
ఈ సారి లోక్సభ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఉండేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. -
ఓట్లు కురిసె.. ఆధిక్యం మెరిసె..
[ 28-04-2024]
పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ముందంజలో నిలుస్తారు. ఇదే ఎన్నికల్లోనూ వర్తిస్తుంది. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఓట్ల ఆధిక్యమే కీలకం. అందుకే పోటీదారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. -
హైదరాబాద్ వీడి చేవెళ్లలో చేరి..
[ 28-04-2024]
జిల్లా కేంద్రమైన వికారాబాద్, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు 2008 వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్...
[ 28-04-2024]
సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటోంది ఎన్నికల సంఘం. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. -
61వ రాజ్యాంగ సవరణతో..
[ 28-04-2024]
తొలినాళ్లలో ఓటు వేయడానికి కనీస వయసు 21 ఏళ్లుగా ఉండేది. దీన్ని రాజ్యాంగంలోనూ పొందుపర్చారు. అయితే 1988లో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా