logo

హస్తం చూపు రాజిరెడ్డి వైపే..

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానానికి మాసాయిపేటకు చెందిన ఆవుల రాజిరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది.

Published : 28 Oct 2023 02:18 IST

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానానికి మాసాయిపేటకు చెందిన ఆవుల రాజిరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక్కడి నుంచి పార్టీ టికెట్‌ను ప్రధానంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్‌ ఆశించారు. కాంగ్రెస్‌ టికెట్‌కు వీరిద్దరితో పాటు టీపీసీసీ ప్రతినిధి ఆంజనేయులుగౌడ్‌ సైతం అర్జీ పెట్టుకున్నారు. అయితే అధిష్ఠానం మాత్రం ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ల పేర్లను మాత్రమే దిల్లీకి పంపింది. వీరిలో రాజిరెడ్డికే మద్దతు లభించింది. ఈయన తల్లిదండ్రులు ప్రేమలమ్మ, నారాయణరెడ్డి. మూడుసార్లు సింగిల్‌ విండో అధ్యక్షుడిగా పని చేశారు. తండ్రి స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరి అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. ఒకవైపు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాలపై ఆసక్తి చూపారు. ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐలో చేరి ప్రస్థానాన్ని ఆరంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని