మూడో జాబితాలో ముగ్గురు!
శాసనసభ అభ్యర్థుల మూడో జాబితాను భాజపా అధిష్ఠానం గురువారం విడుదల చేసింది. అందోలు నుంచి మాజీ మంత్రి పి.బాబూమోహన్, నారాయణఖేడ్లో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జహీరాబాద్లో రాంచందర్ రాజనర్సింహ పేర్లను ప్రకటించారు.
భాజపా అభ్యర్థుల ఖరారు
సంగారెడ్డిపై తకరారు
శాసనసభ అభ్యర్థుల మూడో జాబితాను భాజపా అధిష్ఠానం గురువారం విడుదల చేసింది. అందోలు నుంచి మాజీ మంత్రి పి.బాబూమోహన్, నారాయణఖేడ్లో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జహీరాబాద్లో రాంచందర్ రాజనర్సింహ పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో పటాన్చెరు అభ్యర్థిగా నందీశ్వర్గౌడ్ను ఖరారు చేసిన విషయం విదితమే. సంగారెడ్డిలో టికెట్ ఆశావహుల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో టికెట్ కేటాయింపును వాయిదా వేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట.
అందోలు బరిలో బాబూమోహన్
భాజపా ప్రకటించిన తొలి జాబితాలో అందోలు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి మాజీ మంత్రి, సినీ నటుడు పల్లి బాబూమోహన్కు చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భాజపా వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. మూడో జాబితాలో ఆయనకు టికెట్ ఖరారయింది. జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు బాలయ్య, భాజపా దళిత మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి కె.జగన్ అందోలు స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. చివరికి బాబూమోహన్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి అందోలు నియోజకవర్గం నుంచి బాబూమోహన్ తెదేపా తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ గెలుపొందారు. తెదేపా ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. 2004, 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో భారాస(తెరాస)లో చేరి.. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018లో భారాస టికెట్ దక్కకపోవడంతో భాజపా చేరి బరిలో నిలిచారు. భారాస అభ్యర్థి క్రాంతికిరణ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
జహీరాబాద్: రాంచందర్కు అవకాశం
జహీరాబాద్ భాజపా అభ్యర్థిగా రాంచందర్ రాజనర్సింహ పేరును భాజపా ప్రకటించింది. ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సోదరుడు. ఈ ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆరు నెలల క్రితం కాంగ్రెస్లో నుంచి భాజపాలో చేరారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. భాజపా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. భారాస టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నుంచి భాజపాలోకి చేరిన సామాజిక ఉద్యమకారుడు దిల్లీ వసంత్, భాజపా జిల్లా అధికార ప్రతినిధి సుధీర్కుమార్ జహీరాబాద్ నుంచి పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి రాంచందర్కు అవకాశం దక్కింది. గత ఎన్నికల్లో ఇక్కడ భాజపా తరఫున పోటీ చేసిన జంగం గోపి బీఎస్పీలో చేరారు.
ఖేడ్ నుంచి జన్వాడే సంగప్ప
నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా జన్వాడే సంగప్పను ఆ పార్టీ ఖరారు చేసింది. పార్టీ అభ్యర్థిత్వం కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్రెడ్డి, పార్టీ జహీరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జి రవికుమార్గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జన్వాడే సంగప్ప మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సంగప్పను భాజపా అధిష్ఠానం ఎంపిక చేసి ప్రకటించింది. కంగ్టి మండలం చౌకన్పల్లికి చెందిన సంగప్ప లింగాయత్(బీసీ) సామాజికవర్గానికి చెందినవారు. కొంతకాలం పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. 2021 జనవరి 1న అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు. ఖేడ్ టికెట్ ఆశిస్తూ ఏడాదిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
సంగారెడ్డిలో ఉత్కంఠ
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజకవర్గ టికెట్ భాజపా ఇంకా ఖరారు చేయలేదు. ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్రావు దేశ్పాండే, ఇటీవల భారాస నుంచి చేరిన పులిమామిడి రాజు, న్యాయవాది కె.దయాకర్రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
[ 28-04-2024]
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
[ 28-04-2024]
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సదాశివపేట పట్టణంలో చోటుచేసుకొంది. -
లోక్సభ నియోజకవర్గ ఓటర్లు @ 18.28 లక్షలు
[ 28-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. -
ఎండ ప్రచండం.. ప్రచారానికి గండం!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది. -
భారాస హయాంలోనే తెలంగాణ అభివృద్ధి: పద్మ
[ 28-04-2024]
పద్నాలుగు ఏళ్ల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి...అన్ని రంగాలను ముందుకు నడిపి తొమ్మిదిన్నరేళ్లలో భారాస అధినేత కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా -
కాంగ్రెస్ను గెలిపిస్తేనే పురోగతి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. -
డార్మిటరీలో స్నేహం.. చోరీల వ్యూహం
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మిటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
వక్ఫ్బోర్డు స్థలాల్లో ఆగని ఆక్రమణల పర్వం
[ 28-04-2024]
రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్బోర్డుకు ఛైర్మన్ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా... -
తెలంగాణ గాంధీ కేసీఆర్: చింతా ప్రభాకర్
[ 28-04-2024]
ప్రాణాల సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ గాంధీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. -
పెరుగుతుందా.. తగ్గుతుందా..!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
కేసీఆర్ ఒక్కరే!
[ 28-04-2024]
గజ్వేల్ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉండేది. -
పోలింగ్ కేంద్రాలు.. సమగ్ర వివరాలు
[ 28-04-2024]
ఈ సారి లోక్సభ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఉండేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. -
ఓట్లు కురిసె.. ఆధిక్యం మెరిసె..
[ 28-04-2024]
పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ముందంజలో నిలుస్తారు. ఇదే ఎన్నికల్లోనూ వర్తిస్తుంది. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఓట్ల ఆధిక్యమే కీలకం. అందుకే పోటీదారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. -
హైదరాబాద్ వీడి చేవెళ్లలో చేరి..
[ 28-04-2024]
జిల్లా కేంద్రమైన వికారాబాద్, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు 2008 వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్...
[ 28-04-2024]
సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటోంది ఎన్నికల సంఘం. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. -
61వ రాజ్యాంగ సవరణతో..
[ 28-04-2024]
తొలినాళ్లలో ఓటు వేయడానికి కనీస వయసు 21 ఏళ్లుగా ఉండేది. దీన్ని రాజ్యాంగంలోనూ పొందుపర్చారు. అయితే 1988లో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం