కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.
న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్, పరిగి
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఓటరు చైతన్యం నుంచి ఓటేసే వరకు, పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతుల కల్పన, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం, తర్వాత ఓట్ల లెక్కింపు వరకు ఇలా ఎన్నో ఉంటాయి. మరోవైపు అక్రమాలపై దృష్టిసారిస్తారు. వీటన్నింటికి సంబంధించి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసింది. ఒక్కో దానికి ఒక్కో నోడల్ అధికారిని నియమించారు. అన్ని విభాగాల బాధ్యత కలెక్టర్దే.
మానవ వనరులు: ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిలాల్లో పోలింగ్ రోజు ఎవరెవరు ఎక్కడ విధులు నిర్వర్తించాలనేది ఈ విభాగం నిర్ణయిస్తుంది. జిల్లాలో పే స్కేల్ను పరిగణనలోకి తీసుకోని వివిధ స్థాయిలో అధికారులను నియమించింది.
చైతన్యం: ఓటు హక్కు వినియోగంపై చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ విభాగం పని చేస్తుంది. పోలింగ్ తక్కువ నమోదైన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓటర్లకు ఓటు హక్కు ప్రాధాన్యాన్ని చెబుతారు.
శిక్షణ విభాగం: ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులకు స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ విభాగం ప్రధాన విధి. నియమావళి అమలుపై శిక్షణ ఇచ్చారు.
సామగ్రి పంపిణీ: ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి గుర్తించడం, వాటిని సమకూర్చుకోవడం వంటి వాటికి ఈ విభాగం పనిచేస్తుంది.
రవాణా సౌకర్యం: పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు సామగ్రి రవాణా చేయడమే ఈ విభాగం పని. జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, ఈవీఎలు, పోలీసులను సకాలంలో చేర్చటం ఈ విభాగం విధి. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు చేర్చడంలోనూ భాగస్వామ్యం.
శాంతి భద్రతల పరిరక్షణ: సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలను ముందే గుర్తించి వాటిపై నిఘూ పెట్టడం, ఆయుధాలు ఉన్న వారి వివరాల సేకరణ, తదితర కార్యకలాపాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది.
ఈవీఎంల నిర్వహణ: ఓటింగ్లో కీలకమైన ఈవీఎంలను కేంద్రాలకు చేర్చటం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్ట్రాంగ్ గదుల్లో భద్రపరుస్తారు. వీటిని నిర్వహిస్తుంది.
ఐటీ, కంప్యూటరైజేషన్: సాంకేతిక అంశాలపై ఐటీ, కంప్యూటరైజేషన్ విభాగం పని చేస్తుంది. యాప్ల పని తీరు, వాటి నిర్వహణను పర్యవేక్షిస్తుంది. సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరిస్తుంది.
ప్రవర్తన నియమావళి: రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియమావళి ఉల్లంఘనలపై దృష్టిపెడుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది.
వ్యయ నిర్ధారణ: అభ్యర్థుల ఖర్చులను లెక్కించటానికి వ్యయ నిర్ధాణ విభాగం పని చేస్తుంది. సభలు, సమావేశాలు, వ్యయాన్ని ఆయా అభ్యర్థుల ఖర్చుల్లో చూపిస్తుంది. ఖర్చులకు సంబంధించిన వీడియో, సీడీలను రూపంలో ఎన్నికల సంఘానికి పంపిస్తుంది.
ఫిర్యాదులపై స్పందన: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఈ విభాగం స్పందిస్తుంది. డయల్ 1950, సి-విజిల్, సువిధ యాప్ల వంటి వాటికి అందే ఫిర్యాదులను రికార్డు చేసుకుని పరిష్కరిస్తుంది.
పోస్టల్ బ్యాలెట్: జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సిబ్బందిని గుర్తించి వారంతా ఓటేసేలా ఇది పని చేస్తుంది.
ప్రసార సాధనాలపై: మీడియాలో ప్రసారం, ప్రచురితమయ్యే వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నియమావళికి విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా: రేవంత్ రెడ్డి
[ 02-05-2024]
ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. -
ఇంటి నుంచే ఓటు.. చైతన్యం చాటు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి
[ 02-05-2024]
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. -
గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 02-05-2024]
భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. -
వసతులు కొరవడి.. అన్నదాత అలజడి
[ 02-05-2024]
జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. -
ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
[ 02-05-2024]
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్కు మద్దతు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడారు. -
కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
[ 02-05-2024]
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన -
అప్రమత్తతోనే ప్రశాంతం
[ 02-05-2024]
ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. -
రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
[ 02-05-2024]
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు. -
కేసీఆర్ మా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
[ 02-05-2024]
మల్లన్న సాగర్ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్, వై.శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. -
జొన్న రైతులకు బకాయిల బెంగ
[ 02-05-2024]
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
[ 02-05-2024]
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. -
7, 8 తేదీల్లో మాక్ పోలింగ్పై శిక్షణ
[ 02-05-2024]
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
ఓటమి భయంతోనే భాజపా ఆరోపణలు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆరోపించారు. -
నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
[ 02-05-2024]
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన దుర్గాప్రసాద్, సుబ్బారావు, రవి గౌడ్ ముఠాగా ఏర్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా