పోరు.. ఇక హోరు
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి.
అగ్రనేతలతో ప్రచారానికి కార్యాచరణ సిద్ధం
ఈనాడు, కామారెడ్డి: జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 24న కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఇక ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఆయా పార్టీల అగ్రనేతలను ఆహ్వానిస్తున్నారు.
25న బాన్సువాడకు అమిత్షా
కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్షా ఈ నెల 25న బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న భాజపా ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను సైతం పలు సభల్లో పాల్గొనాలని కోరింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో ప్రధాని మోదీ సభ నిర్వహించేందుకు నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జాతీయ నాయకుల పర్యటనలు ఉండేలా చూసుకుంటోంంది.
ముఖ్యమంత్రితో కాంగ్రెస్ సభలు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపుమీద ఉన్న కాంగ్రెస్ లోకసభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. 26న జహీరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సభలు నిర్వహించనున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సైతం సభలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా మంత్రులు దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్కలతో పాటు మైనార్టీ నేతల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పాల్గొనే సభల షెడ్యూల్ ఖరారు కానుంది.
మే 7న కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షో
2014, 2019 లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన భారాస ఈసారి కూడా గెలుపొందాలనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినప్పటికీ సామాజికవర్గాల వారీగా ప్రజలను కలుస్తూ భారాసను గెలిపించాల్సిన ఆవశ్యకతను నాయకులు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీల అమలులో వైఫల్యాలపై ప్రచారం చేస్తున్నారు. వచ్చే నెల 7న కామారెడ్డిలో అధినేత కేసీఆర్ రోడ్షోను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్లలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు సైతం సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.