రైతుబంధు రాకపాయె..!
యాసంగి రైతుబంధు లబ్ధి జాప్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు అయోమయంలో పడ్డారు. వీరి సంఖ్య దాదాపు 11 వేలు ఉంటుంది.
ఆర్థిక సంవత్సరం ముగిసినా చేతికందని లబ్ధి
గరిడేపల్లిలో వరిసాగు
గరిడేపల్లి, మేళ్లచెరువు, న్యూస్టుడే: యాసంగి రైతుబంధు లబ్ధి జాప్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు అయోమయంలో పడ్డారు. వీరి సంఖ్య దాదాపు 11 వేలు ఉంటుంది. సుమారు 1.10 లక్షల ఎకరాలకు సంబంధించి రెండో విడత అందలేదని తెలుస్తోంది. దీనిపై అధికారులూ రైతులకు ఎలాంటి స్పష్టతనివ్వలేకపోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నేటి (శుక్రవారం)తో ముగియనుండటంతో రైతులూ ఆందోళనకు గురవుతున్నారు.
వీరికి మాత్రమే..
రైతుబంధు పథకం లబ్ధిని ప్రభుత్వం రెండు విడతలుగా ఇస్తోంది. గడిచిన నాలుగు సీజన్ల నుంచి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మొదటి విడత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుండేవి. రెండో విడత పంపిణీ నవంబరు, డిసెంబరు నెలల్లో పూర్తి చేసేవారు. ఈ యేడాది వానాకాలం అలాగే కొనసాగించారు. యాసంగి జనవరి, ఫిబ్రవరి నెల 15 వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. అవి ప్రాధాన్యం ప్రకారం పది ఎకరాల్లోపు వారికి లబ్ధి చేకూరింది. వీరితో పాటు 20 ఎకరాలు పైబడిన వారి ఖాతాల్లోనూ డబ్బులు జమయ్యాయని బాధితుల ఆరోపణ. లబ్ధి అందని వారిలో ఎటొచ్చీ పది నుంచి 20 ఎకరాల్లోపు వారే ఎక్కువగా ఉండడం గమనార్హం.
అధికారులకు ఫోన్లతో తలనొప్పి..
లబ్ధి జరగని రైతులు మాత్రం నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. జిల్లా స్థాయి అధికారుల వరకు నిత్యం ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అధికారులకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తలపట్టుకుంటున్నారు. రైతులకు స్పష్టతనివ్వలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధి చేకూరని వారి సంఖ్య దాదాపు 11 వేల మంది. వీరందరికీ మూడు నెలల నుంచి నిరీక్షణ తప్పడం లేదు. గత సీజన్లలో రెండు విడతలుగా ఇచ్చే రైతుబంధుతో రైతుల సంతృప్తి పడేవారు. ఈసారి మాత్రం యాసంగి విడత రాకపోవడం.. అది నేటితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వం దృష్టిలో ఉంది
- రామారావు, జిల్లా వ్యవసాయాధికారి, సూర్యాపేట
రైతుబంధు పథకం రెండో విడత చాలావరకు పంపిణీ జరిగింది. ఇంకా 3 వేల మంది రైతులకు అందాల్సి ఉంది. ప్రాధాన్యం ప్రకారం ఇప్పటివరకు రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. మా దగ్గర వివరాలన్నీ ప్రభుత్వానికి పంపాం. ఇంకా జమవ్వని ఖాతాల వివరాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రిలో హరిహరుల ఆరాధనలు
[ 07-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
[ 07-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
అభివృద్ధిని వివరించి.. ఆమోదీంచాలని అభ్యర్థించి..!
[ 07-05-2024]
భువనగిరి పార్టీ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్, సైదిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన జనసభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
ఓటుహక్కుపై అవగాహన పెరిగేలా ప్రచారం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చిట్యాల సమీపంలోని గాంధీగుడి ఆధ్వర్యంలో నల్గొండలో ప్రచారం నిర్వహించారు. -
సౌర విద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు
[ 07-05-2024]
విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది. -
ఆమె ఇంటికే పరిమితమైతే..అంతే..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుకు ఇబ్బందులు కలగొద్దు
[ 07-05-2024]
ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. -
మాట తప్పితే రాజీనామా చేస్తావా..!
[ 07-05-2024]
ప్రియమైన లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు. -
అల్లాపురం విద్యార్థి.. సికింద్రాబాద్ అభ్యర్థి
[ 07-05-2024]
చౌటుప్పల్ మండలం అల్లాపురానికి చెందిన విద్యార్థి రాసాల వినోద్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు -
రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన
[ 07-05-2024]
‘ముఖ్యమంత్రి కాగానే రేవంత్రెడ్డి ఈ (భువనగిరి) ప్రాంత ప్రజల మేలు కోరి మూసీ ప్రక్షాళనను రూ.50 వేల కోట్లతో చేపడుతామని వెల్లడించారు. -
సామాజిక వేదికలు.. ప్రచారాస్త్రాలు
[ 07-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై..!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు