భాజపా అభ్యర్థులబయోడేటా
తొలిసారి 1999లో తుంగతుర్తి నుంచి తెదేపా తరఫున పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వర్రావు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సూర్యాపేట: సంకినేని వెంకటేశ్వరరావు
తొలిసారి 1999లో తుంగతుర్తి నుంచి తెదేపా తరఫున పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వర్రావు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2004లో తుంగతుర్తి నుంచి 2009, 2014, 2018లో సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో భాజపాలో చేరారు. 2014లో సూర్యాపేట నుంచి పార్టీ టిక్కెట్ ఆశించినా పొత్తుల్లో భాగంగా తెదేపాకు ఇవ్వడంతో సంకినేని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అనంతరం 2018లో భాజపా నుంచి తొలిసారి పోటీ చేసి సుమారు 40 వేల ఓట్లు సాధించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. భాజపా తరఫున వరుసగా రెండోసారి సూర్యాపేట నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈయన స్వస్థలం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం.
భువనగిరి: గూడూరు నారాయణరెడ్డి
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఉద్యమాల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన గూడూరు నారాయణరెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. హైదరాబాద్ ఎస్వీ కళాశాల అధ్యక్షుడిగా పనిచేశారు. ఏఐసీసీ సభ్యుడిగానూ కొనసాగారు. రెండేళ్ల క్రితం భాజపాలో చేరి చేనేతలకు మగ్గాల పంపిణీతో పాటు పలు స్వచ్ఛంద సేవాసంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్న నారాయణరెడ్డి స్వస్థలం బీబీనగర్ మండలం గూడూరు.
నాగార్జునసాగర్: కంకణాల నివేదితరెడ్డి
ఇక్కడి నుంచి తొలిసారి 2018లో మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేశారు. ఈమె భర్త కంకణాల శ్రీధర్రెడ్డి ప్రస్తుతం పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. తిరిగి ప్రస్తుతం రెండోసారి పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారు. తండ్రి తరఫు కుటుంబానికి ఆర్ఎస్ఎస్తో 40 ఏళ్లుగా అనుబంధం ఉంది. నివేదిత సైతం ఆర్ఎస్ఎస్ మహిళా విభాగంలో కొంత కాలంగా చురుగ్గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పెద్దవూర మండలంలో గత కొన్నాళ్ల నుంచి స్పిన్నింగ్ మిల్లు వ్యాపారంలోనూ ఉన్నారు. ఈమె స్వస్థలం పెద్దవూర మండలం పులిచర్ల.
తుంగతుర్తి: కడియం రామచంద్రయ్య
గనులు, భూగర్భ వనరుల అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన రామచంద్రయ్య ఉద్యోగం తొలి దశలో కొన్నాళ్లపాటు ఉమ్మడి జిల్లాలోని చిట్యాల, వట్టిమర్తి లాంటి ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు. తొలిసారి 2018లో భాజపా నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం నాగారం మండల కేంద్రం. కొంత కాలంగా కడియం సోమక్క మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈనాడు, నల్గొండ- న్యూస్టుడే, భానుపురి, తిరుమలగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తంలోకి ఆహ్వానం..!
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. రెండు స్థానాలకు ఇన్ఛార్జులుగా మంత్రి ఉత్తమ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్నారు. -
పక్షం రోజుల లక్ష్యం.. ప్రచారాస్త్రాలు సిద్ధం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో ఇప్పటికే తేలిపోవడంతో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది. -
వారు ఆడిందే ఆట.. కాసుల వేట
[ 28-04-2024]
కంచే చేను మేసినట్లుగా.. ఔషధ దుకాణాల్లో జరిగే అవినీతిని అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేసుకుని రూ.కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. -
నిద్రలేమి.. నిండు ప్రాణాలు బలి
[ 28-04-2024]
నిద్రలేమి కారణంగానే ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను నేరుగా వచ్చి ఢీకొట్టడం వెనక గత రాత్రి డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉండటం, ఏకాగ్రత లోపించడమే ప్రధాన కారణం. -
ఆయిల్పాం తోటలకు నీటి కొరత
[ 28-04-2024]
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రోత్సహిస్తున్న ఆయిల్పాం సాగుపై కరవు ప్రభావం పడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు అందక, ఈ తోటల్లో బిందుసేద్యం పరికరాలు సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పంచనారసింహులకు భక్తుల పూజలు
[ 28-04-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం నిర్వహించిన పూజారులు బిందేతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
ఆటాడుకుందాం..రా..!
[ 28-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు చరవాణులకే పరిమితం కాకుండా.. వాటి నుంచి చిన్నారుల దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. -
సంఘాలను కాదని.. సంస్థకు అప్పగించి..
[ 28-04-2024]
పురపాలక సంఘం పరిధిలో చేపట్టాల్సిన పనులకు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అర్హులకు లబ్ధి చేకూరకపోగా పనులు ముందుకు సాగడం లేదు. -
లెక్కకు మించితే వేటే
[ 28-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం కన్నేసింది. -
లోక్సభ ప్రచారంలో.. స్థానిక వ్యూహం
[ 28-04-2024]
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు మాసాలకే జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. -
ద్విసభ.. పదేళ్ల ముచ్చట
[ 28-04-2024]
లోక్సభకు 1951లో తొలిసారి ఎన్నికలు జరగగా హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతానికి 1952లో జరిగాయి. మద్రాసు రాష్ట్రం పరిధిలోని ఆంధ్రా ప్రాంతానికి, హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఇద్దరు చొప్పున సభ్యులను ఎన్నుకునే వారు. -
మరో ఉద్యమానికి శ్రీకారం: జగదీశ్రెడ్డి
[ 28-04-2024]
ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల పోరాటం చేసి దిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సాధించిన భారాస మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు