అనుబంధాలు అల్లుకుందాం.. రండి
రోజురోజుకూ సాంకేతికత పెరుగుతోంది. మూడేళ్ల చిన్నారులు సైతం స్మార్ట్ఫోన్లు పట్టుకుని వీడియో ఆటలు ఆడుతున్నారు.
రోజురోజుకూ సాంకేతికత పెరుగుతోంది. మూడేళ్ల చిన్నారులు సైతం స్మార్ట్ఫోన్లు పట్టుకుని వీడియో ఆటలు ఆడుతున్నారు. ఇదే సమయంలో కుటుంబ బంధాలు తగ్గిపోయి నైతికతను కోల్పోయి పక్క దారులు పడుతున్నారు. చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేక హింస, అరాచకాలకు పాల్పడటం, ఆత్మహత్యలు చేసుకుంటూ నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబంలో పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఒకే దగ్గరున్న నాలుగు మాటలు మాట్లాడుకోలేని పరిస్థితి. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు మానసిక, నైతిక, కుటుంబ బంధాల గురించి నేర్పాల్సిన అవసరముంది.
అడవిదేవులపల్లి, న్యూస్టుడే: అన్నం పెట్టు.. ఫీజుకు డబ్బులు కావాలి.. నాకు ఫలానా వస్తువు కావాలి. ఇలాంటి సాధారణ అవసరాల కోసమే తప్పా ఆప్యాయతను పంచుకునే మాటలు నేడు కుటుంబాల్లో కరవయ్యాయి. పిల్లలకు తల్లిదండ్రులతో సాన్నిహిత్యం లేక భావోద్వేగ బంధం తగ్గిపోతోంది. టీవీలు, సామాజిక మాధ్యమాలకు పెద్దలు మొగ్గు చూపుతూ.. పిల్లల అడ్డు లేకుండా వీరికి ఓ స్మార్ట్ఫోన్ ఇస్తున్నారు. దీంతో వీరు హింసాత్మక వీడియో ఆటలు చూస్తూ అదే బాటలో ప్రయాణిస్తున్నారు. ఈ విధానం మారకపోతే పిల్లలు ప్రేమ, మానసిక విలువలకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
మాధ్యమిక విద్య.. మానవ విలువల చేర్పు..
ఇంటర్మీడియట్ దశ అన్నింటికీ కీలకం. మానసికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణమిది. ర్యాంకులు, మార్కుల ధ్యాసలో పడి మానవీయ విలువలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా చెడు వ్యసనాలకు బానిస కావడం, హింస మార్గంలో పయనిస్తూ సమాజానికి భారంగా మారుతున్నారు.
ఏదీ..నాటి వైభవం
రోజురోజుకు కుటుంబ బంధాలు క్షీణిస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకేచోట నానమ్మ, తాతయ్య, బాబాయి, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న ఇలా అందరూ కలిసిమెలసి ఉండేవారు. ఒకరికి కష్టమొచ్చినా అందరు పంచుకోవడంతో ఆ వ్యక్తిపై ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు. ప్రస్తుత కుటుంబ వ్యవస్థ వల్ల చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేక పోతున్నారు. పిల్లలకు మంచి చెడు చెప్పేవారు, ఆత్మస్థైర్యం నింపేవారు లేరు. చిన్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కుటుంబ బంధాలు బలంగా ఉండేలా చూడాలి.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం
-ఎం.డి అబ్బాస్అలీ, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీ ఉన్నత పాఠశాల, అడవిదేవులపల్లి
పిల్లలకు అన్ని విషయాలు బోధించినట్లు గానే నైతిక విలువలను ఒక పాఠంగా నేర్పాలి. దీనివల్ల ప్రాథమిక స్థాయి నుంచే నైతికంగా ఎదుగుతారు. మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయాలి. మార్కులే భవిష్యత్తు అనే ధోరణిలో కాకుండా వీటికి సైతం తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.
నిరంతరం గమనిస్తూ ఉండాలి:
డాక్టర్ భవాని, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మిర్యాలగూడ
ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు పిల్లలపై ఒత్తిడి ఉంటోంది. తల్లితండ్రులు కుటుంబంలోని పెద్దలను గౌరవిస్తూ.. సమాజంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి పిల్లలకు పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తూ తమతో గడిపేలాగా చూడాలి. పెద్దలను, గురువులను గౌరవించడం, తోటివారితో స్నేహంగా ఉండేలా నేర్పిస్తూ నిరంతరం గమనిస్తూ ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!