శ్రీస్వామి కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ప్రత్యేక పూజలు
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నిత్య కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న పూజారులు
యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్టుడే: యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టాక మూలవరులను నిజాభిషేకం, తులసి పత్రాలతో ఆర్చన జరిపారు. ప్రధాన ఆలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మందిరంలో ప్రత్యేక ఆకుపూజ చేపట్టారు. మహాముఖ మండపంలో వేదమంత్ర పఠనాల మధ్య అష్టోత్తరం కొనసాగింది. శ్రీ లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణ పర్వాన్ని విష్వక్సేన ఆరాధనతో జరిపారు. గజ వాహనంపై అధిష్ఠించిన శ్రీస్వామి, అమ్మ వార్ల కల్యాణమూర్తుల సేవోత్సవాన్ని మాడవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం వేళ ఆలంకార జోడు సేవోత్సవాన్ని ఆలయ ఆచారంగా నిర్వహించారు. రాత్రి స్వయంభులను కొలుస్తూ ఆరాధన, సహస్రనామార్చన జరిపారు. ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా స్వామివారికి నిత్యాదాయం రూ.12,38,002 సమకూరిందని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.
పెరిగిన నారసింహుడి వార్షిక ఆదాయం
యాదగిరిగుట్ట అర్బన్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం 2023-24 వార్షిక ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు ప్రకటనలో తెలిపారు. దేవస్థానం వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను ఆయన విడుదల చేశారు. రూ.224.25 కోట్ల ఆదాయం సమకూరగా రూ.214.55 కోట్ల వ్యయమైనట్లు తెలిపారు. రూ.9.70 కోట్లు మిగులు చూపారు. హుండీ కానుకల ద్వారా రూ.32.26 కోట్లు, సత్యనారాయణ వ్రతాలతో రూ.5.61 కోట్లు, ఇతర విభాగాలు అన్నీ కలుపుకొని మొత్తం రూ.224,25,87,229 సమకూరిందని పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది వేతనాలు, పింఛన్లకు రూ.35.83 కోట్లు, ప్రసాదాలు, సరకులకు రూ.26.96 కోట్లు, ప్రభుత్వానికి పన్నులు చెల్లింపులు రూ.20.72 కోట్లు, పొరుగు సేవలకు రూ.7.17 కోట్లు, విద్యుత్తు, నీటి నిర్వహణకు రూ.3.91కోట్ల ఇతర ఖర్చులతో మొత్తం రూ.214,55,85,249 వార్షిక వ్యయమైందని ఈవో వెల్లడించారు. 2022-23లో రూ.193.62 కోట్లు రాగా రూ.189.97కోట్లు వ్యయమైందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
[ 29-04-2024]
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. -
భువనగిరి బరిలో 39 మంది
[ 29-04-2024]
భువనగిరి పార్లమెంటు స్థానానికిగాను 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా పోటీలో 39 మంది మిగిలారు. -
పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు
[ 29-04-2024]
భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు. -
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!