అమ్మకానికి ఆడబిడ్డ.. అడ్డుకున్న పోలీసులు
రెండో కాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో ఆర్థికంగా భారం అవుతుందని.. పిల్లలు లేని వారికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు..
సూర్యాపేటలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్ హెగ్డే, చిత్రంలో పోలీసులు, ముసుగులో ఉన్న నిందితులు
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: రెండో కాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో ఆర్థికంగా భారం అవుతుందని.. పిల్లలు లేని వారికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. కానీ నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి అందుకు అంగీకరించకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ పథకం రచించిన ఆ శిశువు తాతతోపాటు మరో ఐదుగురు నిందితులను మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు సూర్యాపేటలోని తన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండాకు చెందిన మేరావత్ పూల్సింగ్ తన కూతురికి మొదటగా ఆడబిడ్డ పుట్టగా.. రెండో సంతానంగా ఇరవై రోజుల కిందట మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. కుమార్తెకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో ఆమెకు ఆర్థికంగా భారం అవుతుందని పుట్టిన బిడ్డను పిల్లలు లేనివారికి విక్రయించి డబ్బులు సంపాదిస్తే బాగుపడుతుందని భావించాడు. అతని మేనకోడలు మేరావత్ దుర్గ గతంలో ఓ ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేసినప్పుడు పరిచయమైన షేక్ సైదమ్మ అలియాస్ సాయిబీ, ముడావత్ రాజానాయక్, శివనేని నాగమణితో పిల్లల్ని దత్తత చేసుకునే వారి గురించి విచారించాడు. విజయవాడకు చెందిన గరికముక్కు విజయలక్ష్మి, వాడపల్లి అశోక్కుమార్ మధ్యవర్తులుగా రూ.3 లక్షలకు ఆడపిల్లను విక్రయించేలా అంగీకారం కుదుర్చుకున్నాడు. వారు పాపను ఒకసారి చూసిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పి మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజి వద్దకు తీసుకురావాలని సూచించారు. తల్లికి మాయమాటలు చెప్పి పూల్సింగ్ సోమవారం అనుకున్న చోటుకి తీసుకొచ్చాడు. కూతురు చేతుల నుంచి బిడ్డను బలవంతంగా లాక్కొని విజయలక్ష్మి, అశోక్కుమార్కు ఇచ్చాడు. తల్లి గట్టిగా ప్రశ్నించడంతో పాపను తమకు విక్రయించినట్లు తెలిపారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. సహకరించిన నలుగురు నిందితులు షేక్ సైదమ్మ, బలగం సరోజ, గంజల సింధు, సరేశ్ పరారయ్యారు. ఈ మేరకు నిందితులను మంగళవారం రిమాండ్కు తరలించామని ఎస్పీ వివరించారు. స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై అంజిరెడ్డి సీసీఎస్ ఎస్సై సాయి ప్రశాంత్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం