logo

లోక్‌సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్‌

ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్‌సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ అన్నారు.

Published : 24 Apr 2024 02:26 IST

నూతనకల్‌లో మాట్లాడుతున్న భువనగిరి లోక్‌సభ సీపీఎం అభ్యర్థి జహంగీర్‌, చిత్రంలో రంగారెడ్డి, మల్లు లక్ష్మి

నూతనకల్‌, న్యూస్‌టుడే: ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్‌సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ అన్నారు. నూతనకల్‌లో మంగళవారం రాత్రి ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశసంపదను కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీ కేవలం సీపీఎం ఒక్కటేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కందాల శంకర్‌రెడ్డి, పులుసు సత్యం, అల్లిపురం సంజీవరెడ్డి, తొట్ల లింగయ్య, సైదులు, వెంకటేశ్వర్లు, గోపి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని