logo

కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు వేగవంతం

జిల్లాలో కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్‌పల్లిలో వంద మందితో సభ్యత్వం చేయించిన...

Published : 24 Jan 2022 04:43 IST


కాంగ్రెస్‌ నాయకులను సన్మానిస్తున్న మానాల మోహన్‌రెడ్డి

కమ్మర్‌పల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్‌పల్లిలో వంద మందితో సభ్యత్వం చేయించిన సల్లూరి కిషన్‌, సుంకెట శ్రీనివాసును ఆదివారం సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఒక బూత్‌లో వంద మందితో సభ్యత్వం చేయించాలని, వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సన్మానం చేయిస్తానని పేర్కొన్నారు. పార్టీ అభిమానులను కాంగ్రెస్‌ కుటుంబంలో చేర్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. జిల్లాలోనే అత్యధికంగా మానాలలో జక్కుల వంశీ 715 మందితో సభ్యత్వం చేయించారని ప్రశంసించారు. కార్యక్రమంలో సుంకెట రవి, బుచ్చిమల్లయ్య, రాజేంద్రప్రసాద్‌, కిషన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు