పోలీసుల అదుపులో మోసగాడు
ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ప్రబుద్ధుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. పోలీసు,
ఉద్యోగాల పేరిట టోకరా
ఈనాడు, నిజామాబాద్: ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ప్రబుద్ధుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. పోలీసు, రెవెన్యూ, ఐసీడీఎస్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ కొలువులు ఇప్పిస్తానంటూ నిర్మల్ జిల్లాకు చెందిన ఈయన పలువురిని బురిడీ కొట్టించాడు. సచివాలయంలో ఉద్యోగిగా పరిచయం చేసుకొని.. పోస్టుకు ఇంత మొత్తం అంటూ నిర్ణయించి మరీ దండుకున్నాడు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కదలికలపై నిఘా ఉంచారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన బంధువు ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నట్లు తెలుసుకుని.. శనివారం ఉదయం మఫ్టీలో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడిని నిజామాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. వసూలు చేసిన డబ్బు ఏం చేశాడు? మోసాల వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విషయాలు తెలుసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
తప్పుదోవ పట్టించే ప్రయత్నం..
నిందితుడిపై కొన్నిరోజుల కిందటే కేసు నమోదు కావడంతో జాగ్రత్తపడ్డాడు. తెలివిగా వ్యవహరించి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. బాధితులకు ఫోన్లు చేస్తూ డబ్బు తిరిగిస్తానని చెప్పాడు. బాధితులకు తెలిసిన హైదరాబాద్లో తన చిరునామా మార్చేశాడు. కానీ బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఎలాగైనా హాజరుకావాల్సి ఉండటంతో ఇక్కడా తన తెలివిని వినియోగించాడు. పోలీసులకు అందుబాటులో ఉన్న బాధితులకు మళ్లీ ఫోన్ చేశాడు. తనకు గుండె జబ్బు సమస్య తలెత్తిందని, ప్రస్తుతానికి అనంతపురంలో ఉన్నట్లుగా తెలిపాడు. వైద్యుడి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే వచ్చి కలుస్తానన్నాడు. పోలీసులకు ఈ సమాచారం వెళ్తే. ఎవరి దృష్టి పడదనుకున్నాడు. కానీ పోలీసులు మఫ్టీలో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
రెండు జిల్లాల్లో బాధితులు..
రెండు జిల్లాల్లో బాధితులు ఠాణాల్లో ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయి. కానీ, అరెస్టు జాప్యమవుతూ వచ్చింది. నిజామాబాద్కు చెందిన బాధితులు అతడితో ఫోన్లో అందుబాటులో ఉండి కదలికలను పోలీసులకు చెప్పారు. వీరి నుంచే రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘తాను మరో మహిళా అధికారిణి నమ్మి డబ్బులు ఇచ్చానని.. ఆమె ఇప్పుడు పదవీ విరమణ పొందినట్లు’ నిందితుడు చెప్పినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?