Cheating: వివాహిత ఘరానా మోసం.. వధువుగా పరిచయమై..
భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్న వివాహిత.. ఓ యువకుడికి వధువుగా పరిచయమై అతనిని మోసం చేసిన ఘటన బోధన్ మండలంలో వెలుగు చూసింది.
బోధన్ గ్రామీణం, న్యూస్టుడే: భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్న వివాహిత.. ఓ యువకుడికి వధువుగా పరిచయమై అతనిని మోసం చేసిన ఘటన బోధన్ మండలంలో వెలుగు చూసింది. ముఖ పరిచయం లేకుండా ఏడాదిగా పెళ్లి చేసుకుంటానంటూ చెబుతూ అతని నుంచి రూ.4 లక్షలు తీసుకుంది. ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. తెలిసిన సమాచారం మేరకు.. బోధన్ ఉమ్మడి మండలానికి చెందిన ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమొనీలో పేరు నమోదు చేసుకున్నాడు. అందులో యువకుడి ఫోన్ నెంబరు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్కు చెందిన స్వాతి అనే మహిళ గతేడాది అక్టోబరులో తనను తాను పరిచయం చేసుకుంది. ఒకరి సమాచారం ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సదరు మహిళ వీడియోకాల్ ద్వారా యువకుడిని పలకరించింది. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇక్కడి వరకు సజావుగా కథ నడిపిన సదరు మహిళ తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానాలో ఉన్నానంటూ అత్యవసరంగా డబ్బు కావాలని యువకుడిని కోరింది. అప్పటి నుంచి క్రమంగా అవసరం మేరకు అతడిని డబ్బుల కోసం వాడుకుంటూ వచ్చింది. ఇలా రూ.4 లక్షలు కాజేసింది. పరిచయమై ఏడాది సమీపిస్తుండటంతో పెళ్లి చేసుకోవాలని యువకుడు ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె యువకుడి నెంబరు బ్లాక్ చేసింది. అనుమానం వచ్చి ఆరా తీయగా స్వాతి వివాహిత అని, ఇద్దరు కూతుళ్లు, భర్త ఉన్నట్లు తేలింది. ఈ విషయమై యువకుడు ఆమెను నిలదీయగా.. ‘మమ్మల్ని ఇబ్బంది పెట్టావు’ అని బెదిరిస్తూ ఎదురుదాడికి దిగింది. దీంతో కంగుతిన్న యువకుడు కోర్టును ఆశ్రయించి బోధన్ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. స్వాతి, ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు కలిసే మోసానికి పాల్పడినట్లు తేలింది. అప్పుడప్పుడు స్వాతి స్నేహితురాళ్లుగా యువకుడితో ఆమె కూతుళ్లే మాట్లాడినట్లు తెలిసింది. ఆమె కుటుంబమే ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలి: కలెక్టర్
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో శిక్షణ పొందిన సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి
[ 06-05-2024]
ఇన్స్ ఫైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాగిరెడ్డి పెట మండలం, వదల్ పర్తి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 06-05-2024]
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇందూరులోనే పసుపు బోర్డు..
[ 06-05-2024]
కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. -
దారి పొడవునా గులాబీ దండు!
[ 06-05-2024]
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. వీణవంక నుంచి జగిత్యాల వరకు దారి పొడువునా జనాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. -
ఆదిలోనే ఆశాభంగం
[ 06-05-2024]
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను నమ్ముకొని వచ్చే ఆమ్చూర్ రైతులకు ఈ సారి ఆశాభంగం తప్పడం లేదు. గతేడాది ఊరించిన ధరలు ఈసారి అడియాసలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట యార్డుకు వస్తోంది. క్వింటా ధర సగటున రూ.20 వేలకు చేరుకోవడం లేదు. -
భారాస అధినేత కేసీఆర్ ప్రచారం నేడు
[ 06-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భారాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాకు వస్తున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. -
ఎవరి ధీమా వారిదే..!
[ 06-05-2024]
పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. రాజకీయ పార్టీల నేతలు బూత్స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఓటర్ల చెంతకు వెళ్తున్నారు. లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. కామారెడ్డిపై భారాస, కాంగ్రెస్, భాజపా ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం సాగిస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
లెక్క తప్పారు..!
[ 06-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆయా సబ్జెక్టుల్లో 1303 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. 11,926 మంది పరీక్షలు రాయగా 11,057 ఉత్తీర్ణులయ్యారు. 92.71 శాతం ఫలితాలు నమోదయ్యాయి. -
తుది అంకానికి ఎన్నికల ప్రక్రియ
[ 06-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. మూడు జిల్లాల అధికారులు అహర్నిశలుగా శ్రమిస్తుండడంతో ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. లోక్సభ పరిధిలో ఈ నెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ ప్రక్రియ కోసం ఓటర్లకు చీటీల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. -
సార్వత్రిక సమరం.. యువోత్సాహం
[ 06-05-2024]
ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు. పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా పొందవచ్చు. ఎన్నికల్లో నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు. చట్టసభలకు పంపవచ్చు. సమర్థ పాలనకు పట్టం కట్టవచ్చు. ఈ విషయమై యువతీయువకుల్లో చైతన్యం పెరిగింది. -
ప్రమాదంలో పౌర హక్కులు
[ 06-05-2024]
దేశంలో పదేళ్లుగా పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్క్లబ్లో మువ్వా నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు. -
మత్తు పదార్థం పట్టివేత.. నలుగురి అరెస్టు
[ 06-05-2024]
నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న నలుగురిని భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం భిక్కనూరు సీఐ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పెద్దమల్లారెడ్డి శివారులో కారులో అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేసి ముగ్గురిని పట్టుకున్నారు. -
తగ్గని భానుడి ప్రతాపం
[ 06-05-2024]
జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. వరుసగా పగటిపూట ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం గరిష్ఠంగా నిజామాబాద్ ఉత్తరంలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇందూరు నగరం రెడ్జోన్లోకి వెళ్లింది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం రికార్డు స్థాయిలో 36.1 డిగ్రీలు ఉండటం గమనార్హం. -
‘నాకు మద్దతివ్వండి’
[ 06-05-2024]
జహీరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్ను బాన్సువాడలో ఆదివారం మున్నూరుకాపు సంఘం నాయకులు కలిశారు. అనిల్కుమార్ మాట్లాడుతూ తాను మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవాడినని, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. -
‘పథకాలే భాజపాను గెలిపిస్తాయి’
[ 06-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మాచారెడ్డి, పల్వంచ మండలాల్లో భాజపా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం’
[ 06-05-2024]
ఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన భారాస నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మనూరు మండలం తిమ్మాపూర్కు చెందిన తాజా మాజీ ఉప సర్పంచి నర్సింహులు ముదిరాజ్, శంకర్నాయక్ తండాకు చెందిన మాజీ సర్పంచి కిషన్నాయక్తో పాటు పలువురు హస్తం గూటికి చేరారు. -
అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యం
[ 06-05-2024]
రూరల్ ఠాణా పరిధి మల్లారం అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ఠాణాలో కొన్ని రోజుల కింద గంగయ్య(40) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కేసు నమోదు అయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ