logo

ప్రేమించి మోసపోయిన బాలిక ఆత్మహత్య.. కంటతడి పెట్టించిన సూసైడ్ నోట్

ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నడంటూ ఓ బాలిక లేఖ రాసి బలవన్మరణం చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది.

Updated : 27 Aug 2023 09:47 IST

నిజామాబాద్‌ నేరవిభాగం, మోపాల్‌, న్యూస్‌టుడే: ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నడంటూ ఓ బాలిక లేఖ రాసి బలవన్మరణం చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాలిక రాసిన లేఖ స్థానికులను కంటతడి పెట్టించింది. ఆరో ఠాణా ఎస్సై గణేశ్‌ కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లి శనివారం ఉదయం కూరగాయల మార్కెట్‌కు వెంట రమ్మన్నా.. కళ్లకలక వచ్చిందని ఇంట్లోనే ఉంది. పని ముగించుకొని తల్లి ఇంటికి వచ్చే సరికి బాలిక దూలానికి చున్నీతో ఉరేసుకొంది. భయాందోళనకు గురైన తల్లి స్థానికులతో కలిసి కిందకు దించగా అప్పటికే మరణించింది. ప్రేమలో విఫలం కావడంతోనే తమ కుమార్తె మృతి చెందిందని తల్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

లేఖలో ఫోన్‌నంబరు..

‘అన్నా.. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నన్ను క్షమించండి. ప్రేమ పేరుతో మోసపోయా. నన్ను ఒకరు వేధిస్తున్నారు. అందుకే తనువు చాలిస్తున్నా. ఇక నా జీవితం ముగిసింది.. మిమ్మల్ని మిస్‌ అవుతున్నా’ .. అంటూ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టించింది. వేధింపులకు గురిచేసిన వ్యక్తి చరవాణి నంబరును లేఖలో రాసింది. ప్రేమించిన వ్యక్తి మైనర్‌ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు