logo

మానవతావాది వి.పి.చందన్ రావు

వి.పి చందన్‌రావు కవిత్వంలో మానవతావాది అని సీనియర్ జర్నలిస్ట్, సంపాదకులు బైస దేవదాసు అన్నారు.

Published : 29 Mar 2024 19:52 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: వి.పి చందన్‌రావు కవిత్వంలో మానవతావాది అని సీనియర్ జర్నలిస్ట్, సంపాదకులు బైస దేవదాసు అన్నారు. శుక్రవారం హరిచరణ్ మార్వాడి డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి, వ్యాఖ్యాత వి.పి. చందన్ రావు రచించిన చందనాగ్ని కవితా సంపుటి ఆవిష్కరణ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కవులతో స్నేహంగా మెలగడం వలన ధైర్యం, అనుశీలనా శక్తి పెరుగుతాయని వివరించారు. వి.పి. చందన్‌రావు రచనలను కొనియాడారు. ఆయన రచించిన చందనాగ్ని పుస్తకం లోని 171 కవితలు వేటికవే ప్రత్యేక తలతో చదువరులను ఆనందింపచేస్తాయని అన్నారు. కార్యక్రమంలో కవులు, కళాకారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని