నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈనాడు, నిజామాబాద్
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించాలని సూచించారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని చెప్పారు. నామపత్రాలు దాఖలు చేసే సందర్భంలో నిర్దేశిత నిబంధనలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన ఏర్పాట్లపై సీపీ కల్మేశ్వర్తో కలిసి రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు వివరాలు వెల్లడించారు.
సహాయ కేంద్రం..
నామపత్రాల్లో తప్పులు లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ వివరాలు నింపాలి. నామపత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన సందర్భంలో సరిచూసుకునేందుకు సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అధికారి ఉండి సమాచారం ఇస్తారు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్లు దాఖలు చేసుకొనే అవకాశం ఉంటుంది. స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని పార్ట్-3లో ఉన్న గుర్తుల్లో మూడింటిని ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసి వివరాలు నింపాలి. అభ్యర్థి తన పేరిట ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచి.. రూ.10 వేలకు మించి చేసే ఖర్చులకు డీడీ, చెక్కు, ఆర్టీజీఎస్ రూపంలోనే చెల్లించాలి.
17 లక్షలు దాటిన ఓటర్లు..
పార్లమెంట్ నియోజకవర్గంలో 17,01573 ఓటర్లున్నారు. ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరికొంత పెరగనుంది. వీరు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 936 ప్రదేశాల్లో 1807 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఆదర్శ కేంద్రాలను ఎంపిక చేసి నిర్వహించనున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 12-డీ ఫారాలు ఇప్పటికే ఇచ్చారు. వీటిని 22వ తేదీ నాటికి తిరిగి బీఎల్వోలకు అందించాలి. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సంబంధించి.. ఒక దఫా ర్యాండమైజేషన్, శిక్షణ పూర్తయ్యాయి, మే మొదటి వారంలో రెండో దఫా శిక్షణ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులు, ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు నియమితులైన ప్రత్యేక అధికారులు ఒకరు గురువారం, మరొకరు 23, 24 తేదీల్లో రానున్నారు.
వివరాలు వెల్లడిస్తున్న రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు, చిత్రంలో సీపీ కళ్మేశ్వర్, అదనపు కలెక్టర్ అంకిత్
తేదీలు.. సమయాలివే..
నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమై వచ్చే ఈనెల 25తో ముగుస్తుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలోనే స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. 26న దాఖలైన నామపత్రాల పరిశీలన మధ్యాహ్నం 3 గంటలకు ముగిశాక.. రెండు గంటల పాటు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 27వ తేదీ నాలుగో శనివారం, 28వ తేదీ ఆదివారం ఉపసంహరణకు అవకాశం లేదు. ఇక మిగిలింది 29న ఒక్కరోజు మాత్రమే.
200 మీటర్ల దూరంగా..
కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఉన్నందున 200 మీటర్ల దూరంలోనే ర్యాలీలు నిలిపివేయాలి. ఈ పరిధిలో నాయకుల ప్రచారం, ప్రసంగాలు నిషేధం. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నామపత్రాల దాఖలుకు వచ్చే సందర్భంలో అనుమతి తీసుకున్న మూడు వాహనాలను మాత్రమే లోపలికి రానిస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురికి అవకాశం ఉంది. పార్టీలు ప్రచార సభ, ర్యాలీల కోసం సువిధ యాప్లో అనుమతి తీసుకోవటం తప్పనిసరి. గుర్తింపు పార్టీల అభ్యర్థిని లోక్సభ స్థానం పరిధిలో ఓటు హక్కు కలిగిన ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్డ్ పార్టీ, స్వతంత్రులైతే పది మంది ప్రతిపాదించాలి. అభ్యర్థి స్థానికేతరుడైతే ఓటు కలిగి ఉన్న ప్రాంత ఈఆర్వో నుంచి సర్టిఫికేషన్ చేసుకొని సమర్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు నాయకులు నాగిరెడ్డిపేట మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
‘పది’లమైన ఫలితాలు
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో ఈ సారి 14వ స్థానంలో నిలిచింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 11,144 మంది బాలురు, 10,714 బాలికలు మొత్తంగా 21858 మంది పరీక్షలకు హాజరయ్యారు. -
పదిలో కాస్త తడబడి
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది. -
విమర్శల జోరు... కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. -
న్యాయం చేయాలని గుత్తేదారు నిరసన
[ 01-05-2024]
తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్కు తాళం వేసిన ఘటన బీర్కూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. -
పరిధి దాటింది.. బిల్లు వచ్చింది
[ 01-05-2024]
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. -
దడ పుట్టిస్తున్న వడగాలులు
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం ఎండ మండిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతుండడంతో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. -
ఇంటి వద్ద ఓటేసేది 1,758 మంది
[ 01-05-2024]
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు పార్లమెంటు ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. కర్ణాటకలో ఈ పద్ధతి సత్ఫలితం ఇవ్వడంతో ఎన్నికల సంఘం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనవద్ద ప్రవేశపెట్టింది. -
‘ఆ రెండు పార్టీలు ఒక్కటే’
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపా ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, మాజీ మార్క్ఫెడ్ ఛైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. -
బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
[ 01-05-2024]
బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్తో ఇబ్బంది లేదు’
[ 01-05-2024]
యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి వస్తే దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంపీ అర్వింద్ భరోసా ఇచ్చారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సంతోషాన్నిచ్చిందన్నారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలబాలికలు పది జీపీఏ పాయింట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్యాయత్నం..
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?