ప్రణాళికతో సద్వినియోగం
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు.
ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి విద్యాశాఖ
నేటి నుంచి బడులకు వేసవి సెలవులు
కేరింతలు కొడుతున్న అమ్రాద్ ఉన్నత పాఠశాల విద్యార్థులు
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం: సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. ముఖ్యంగా వేసవి సెలవులు ఎంత సరదా తెచ్చిపెడతాయో.. అజాగ్రత్తగా ఉంటే అంతకుమించి ప్రమాదాలు జరుగుతాయి. అలవాట్లు, ఆహారం, ఆరోగ్యం, చదువు తదితర అంశాలను ఓ ప్రణాళిక ప్రకారం విభజించుకుంటే సెలవుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో పాటు ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
ప్రవేశాలు పెంచేందుకు కృషి చేయాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులంతా బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెంచేందుకు అందరూ కృషి చేయాలి. సెలవుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. విద్యార్థులు సెలవుల్ని మంచి వ్యాపకాల కోసం సద్వినియోగం చేసుకోవాలి.
దుర్గాప్రసాద్, డీఈవో
విద్యార్థులకు సూచనలు
ఆరుబయట ఉదయం, సాయంత్రం మాత్రమే ఆడుకోవాలి. చెరువులు, కుంటలు, బావులు, నదుల్లో ఈతకు వెళ్లకపోవడం ఉత్తమమన్నారు. * మంచినీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, కొబ్బరినీళ్లు తీసుకోవాలి.
- ఎండాకాలం దృష్ట్యా శరీరానికి గాలి తగిలేలా కాటన్ దుస్తులు ధరించాలి. బయటకి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపి, నీళ్లసీసా తీసుకువెళ్లాలి.
- వీలైనన్ని కథలు, జీవిత చరిత్ర పుస్తకాలు చదవడంతో పాటు చిత్రలేఖనంపై దృష్టి పెట్టాలని సూచించింది.
- సెలవుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ ఇళ్లకు పంపాలని, వీలైతే తల్లిదండ్రులు తమ పని ప్రదేశానికి తీసుకువెళ్లాలని, తద్వారా వారు పడుతున్న కష్టాలు తెలుస్తాయని, తల్లిదండ్రులు వారి బాల్యంలో జ్ఞాపకాలను చిన్నారులతో పంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ముఖ్యంగా టీవీలు, చరవాణులకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి.
ఉపాధ్యాయులు చేయాల్సింది
చివరి పనిదినం మొదలు పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాల్సిన పనులపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. 2 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చివరి తరగతి పూర్తి చేసిన విద్యార్థుల్ని తప్పనిసరి పై తరగతుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలి. 2 మధ్యాహ్న భోజన బియ్యం నిల్వలు పాడవకుండా చర్యలు చేపట్టాలి. 2 ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో జిల్లాలో 770 బడుల్లో పనులను గుర్తించి రూ.39.38 కోట్ల నిధులు కేటాయించారు. ఆ పనులను ఎప్పటికప్పుడు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించి, పునఃప్రారంభానికి పూర్తి చేయించాలి.2 పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యం నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, రాత పుస్తకాలను జిల్లా గోదాముకి వచ్చిన వెంటనే అక్కడి నుంచి మండల, పాఠశాల స్థాయికి సరఫరా చేయాలని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరులోనే పసుపు బోర్డు..
[ 06-05-2024]
కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. -
దారి పొడవునా గులాబీ దండు!
[ 06-05-2024]
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. వీణవంక నుంచి జగిత్యాల వరకు దారి పొడువునా జనాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. -
ఆదిలోనే ఆశాభంగం
[ 06-05-2024]
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను నమ్ముకొని వచ్చే ఆమ్చూర్ రైతులకు ఈ సారి ఆశాభంగం తప్పడం లేదు. గతేడాది ఊరించిన ధరలు ఈసారి అడియాసలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట యార్డుకు వస్తోంది. క్వింటా ధర సగటున రూ.20 వేలకు చేరుకోవడం లేదు. -
భారాస అధినేత కేసీఆర్ ప్రచారం నేడు
[ 06-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భారాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాకు వస్తున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. -
ఎవరి ధీమా వారిదే..!
[ 06-05-2024]
పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. రాజకీయ పార్టీల నేతలు బూత్స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఓటర్ల చెంతకు వెళ్తున్నారు. లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. కామారెడ్డిపై భారాస, కాంగ్రెస్, భాజపా ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం సాగిస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
లెక్క తప్పారు..!
[ 06-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆయా సబ్జెక్టుల్లో 1303 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. 11,926 మంది పరీక్షలు రాయగా 11,057 ఉత్తీర్ణులయ్యారు. 92.71 శాతం ఫలితాలు నమోదయ్యాయి. -
తుది అంకానికి ఎన్నికల ప్రక్రియ
[ 06-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. మూడు జిల్లాల అధికారులు అహర్నిశలుగా శ్రమిస్తుండడంతో ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. లోక్సభ పరిధిలో ఈ నెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ ప్రక్రియ కోసం ఓటర్లకు చీటీల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. -
సార్వత్రిక సమరం.. యువోత్సాహం
[ 06-05-2024]
ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు. పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా పొందవచ్చు. ఎన్నికల్లో నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు. చట్టసభలకు పంపవచ్చు. సమర్థ పాలనకు పట్టం కట్టవచ్చు. ఈ విషయమై యువతీయువకుల్లో చైతన్యం పెరిగింది. -
ప్రమాదంలో పౌర హక్కులు
[ 06-05-2024]
దేశంలో పదేళ్లుగా పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్క్లబ్లో మువ్వా నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు. -
మత్తు పదార్థం పట్టివేత.. నలుగురి అరెస్టు
[ 06-05-2024]
నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న నలుగురిని భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం భిక్కనూరు సీఐ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పెద్దమల్లారెడ్డి శివారులో కారులో అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేసి ముగ్గురిని పట్టుకున్నారు. -
తగ్గని భానుడి ప్రతాపం
[ 06-05-2024]
జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. వరుసగా పగటిపూట ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం గరిష్ఠంగా నిజామాబాద్ ఉత్తరంలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇందూరు నగరం రెడ్జోన్లోకి వెళ్లింది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం రికార్డు స్థాయిలో 36.1 డిగ్రీలు ఉండటం గమనార్హం. -
‘నాకు మద్దతివ్వండి’
[ 06-05-2024]
జహీరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్ను బాన్సువాడలో ఆదివారం మున్నూరుకాపు సంఘం నాయకులు కలిశారు. అనిల్కుమార్ మాట్లాడుతూ తాను మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవాడినని, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. -
‘పథకాలే భాజపాను గెలిపిస్తాయి’
[ 06-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మాచారెడ్డి, పల్వంచ మండలాల్లో భాజపా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం’
[ 06-05-2024]
ఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన భారాస నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మనూరు మండలం తిమ్మాపూర్కు చెందిన తాజా మాజీ ఉప సర్పంచి నర్సింహులు ముదిరాజ్, శంకర్నాయక్ తండాకు చెందిన మాజీ సర్పంచి కిషన్నాయక్తో పాటు పలువురు హస్తం గూటికి చేరారు. -
అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యం
[ 06-05-2024]
రూరల్ ఠాణా పరిధి మల్లారం అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ఠాణాలో కొన్ని రోజుల కింద గంగయ్య(40) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కేసు నమోదు అయ్యింది.