వదలా.. బొమ్మాళీ
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు.
ఏపీ ఫైబర్ నెట్ తెరిచిన వెంటనే కనిపించేది ఇలా.
ఈనాడు- విజయనగరం, విజయనగరం పట్టణం - న్యూస్టుడే: అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ప్రజలు, ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకోకుండా రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ భారీ కటౌట్లు పెట్టారు. శనివారం సాయంత్రం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించాల్సి ఉన్నా.. యంత్రాంగం చోద్యం చూస్తోంది.
ఆరుబయట ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాలు, అంతర్జాలంలో అధికార పార్టీ నాయకుల ప్రచారానికి ఇంకా అడ్డుకట్ట పడలేదు. అత్యధిక శాతం ప్రజానీకం అంతర్జాలం వినియోగిస్తున్నందున.. నెటిజన్లకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయి. సమయం వృథా అవుతున్నా వాటిని కొంత వరకు వీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ ఫైబర్ నెట్ను తెరవగానే ముఖ్యమంత్రి బొమ్మ కనిపిస్తోంది. జగన్ ప్రసంగాలు, ప్రభుత్వ ప్రకటనలు ప్రసారం చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు.
సగమే: విజయనగరంలో విగ్రహం ముఖానికి మాత్రమే ముసుగు వేసి వదిలేసిన నగర పాలక సంస్థ సిబ్బంది
విజయనగరం నగర పాలక సంస్థలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి 48 గంటలు గడిచినా ప్రవర్తనా నియమావళిని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ నాయకుల చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలు, ప్రభుత్వ ప్రకటనల బోర్డులు తొలగించకుండా వదిలేశారు. ఇప్పటికే చాలా వరకు ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు తొలగించామని సహాయక సిటీ ప్లానర్లు సీహెచ్ మధుసూదనరావు, పి.అమ్మాజీరావు తెలిపారు. నేతల విగ్రహాల ముఖాలకు ముసుగులు వేశామన్నారు.
కొంకివీధి కూడలిలో వైకాపా రంగులతో నీటి పథకం, జెండా ఆవిష్కరించే దిమ్మె
ఇంకా కనిపించలేదా
సాలూరు, న్యూస్టుడే: సాలూరు పట్టణంలోని కొంకివీధి కూడలిలో ఏర్పాటు చేసిన నీటి పథకం ఇది. దీనికి ఆ పార్టీ అభిమాని వైకాపా జెండా రంగులు వేశారు. అంతేకాదు పురపాలిక రోడ్డుపై వైకాపా జెండా ఆవిష్కరించేందుకు సిమెంట్ దిమ్మె కట్టారు. దానికీ పార్టీ రంగులు వేశారు. ఈ రెండూ పుర అధికారులకు కనిపించలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పుర టీపీవో, ఎన్నికల కోడ్ అమలు అధికారిణి పద్మజ దృష్టికి ‘న్యూస్టుడే’ తీసుకువెళ్లగా పరిశీలించి రంగులు మార్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్