logo

ఘనంగా శిలువ యాత్ర

బలిజిపేట మండలంలో గుడ్‌ ఫ్రైడేను క్రైస్తవ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Updated : 29 Mar 2024 17:40 IST

బలిజిపేట: బలిజిపేట మండలంలో గుడ్‌ ఫ్రైడేను క్రైస్తవ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బలిజిపేట చర్చి నుంచి వెంగాపురం కాథలిక్‌ చర్చి అయిన క్రైస్తవ దేవాలయం వరకు ఫాదర్‌ కిల్లాడ ఆనంద్‌ ఆధ్వర్యంలో వందలాది మంది క్రైస్తవులు శిలువ బొమ్మతో రెండు కిలోమీటర్లు ప్రదర్శనగా వెళ్లి శిలువ యాత్ర చేశారు. ఏసు క్రీస్తును శిలువ వేసే సన్నివేశాన్ని వివిధ వేషధారణలతో క్రైస్తవులు ప్రదర్శనిచ్చారు. 40 రోజులపాటు ఉపవాస ప్రార్థనలు చేసిన సోదరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని