కొలువులకు ఎసరు!!
చదువుతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు గత ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను అందించేది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయిబిల్టీ స్కిల్ సెంటర్లను తీసుకొచ్చింది. చివరి ఏడాది చదువుతుండగానే తరగతులు పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాలు అందజేసేది.
శిక్షణల్లేక పెరుగుతున్న నిరుద్యోగులు
డిగ్రీ కళాశాలలో నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులు(పాతచిత్రం)
చదువుతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు గత ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను అందించేది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయిబిల్టీ స్కిల్ సెంటర్లను తీసుకొచ్చింది. చివరి ఏడాది చదువుతుండగానే తరగతులు పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాలు అందజేసేది. అనంతరం బహుళజాతి సంస్థలో కొలువులకు అవకాశం కల్పించేది. ప్రస్తుతం ఈ ప్రక్రియలన్నీ ఆగిపోయాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో పదుల సంఖ్యలోనే ఉద్యోగాలు పొందారు. అనంతరం కొన్నినెలలకే శిక్షణ ఆపేశారు.
న్యూస్టుడే, మయూరికూడలి
విద్యార్థులకు అండగా..
డిగ్రీ పూర్తయిన వెంటనే కొలువులు సాధించాలని చాలామంది కలలుగంటారు. వాటిని నిజం చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో ఈ శిక్షణ తరగతులను ప్రారంభించింది. 2018- 19 విద్యా సంవత్సరంలో ఉన్న వేలామంది విద్యార్థులు వివరాలు నమోదు చేసుకున్నారు. 2019- 20వ విద్యా సంవత్సరంలో వారిలో దాదాపు 23 వేల మందికి ధ్రువపత్రాలు అందాయి. 480 మందికి పైగా నేరుగా ప్రైవేటు కొలువులు దక్కించుకోగా.. మరికొందరు నైపుణ్యాలను మెరుగుపరుచుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు.
తరగతులు ఇవీ.. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 23 డిగ్రీ కళాశాలల్లో రోజుకు మూడు గంటల వ్యవధిలో ఆన్లైన్లో కోర్సులు సాగేవి. ఈమేరకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రత్యేకంగా కంప్యూటర్లు సమకూర్చారు. ఏడాదిలో సుమారు 400 గంటల పాటు తరగతులు సాగేవి. అర్థమెటిక్, రీజనింగ్, సాఫ్ట్స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్, డిజిటల్ మార్కెటింగ్, అమెజాన్ వెబ్ సర్వీస్, లాంచ్ పాడ్ ఎన్ఎస్ఈ, సైబర్ సెక్యూరిటీ, ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఏడబ్ల్యూఎస్, ఈకోడమ్, ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ విత్ జీఎస్టీ తదితరాలపై అవగాహన కల్పించేవారు.
భారీగా తగ్గుదల..
వైకాపా అధికారంలోకి వచ్చాక శిక్షణలు తగ్గిపోయాయి. ఈలోపు కొవిడ్ రావడంతో పూర్తిగా మందగించాయి. గతంలో శిక్షణ పొందిన వారిలో కొందరికి ఉద్యోగాలు దక్కాయి. 2021- 22లో పునఃప్రారంభానికి చర్యలు చేపట్టినా కొలువులు కల్పించలేకపోయారు. అనంతరం ఆపేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క బ్యాచ్కు మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ నమోదు వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించకపోవడంతో విద్యార్థులు దూరమైనట్లు తెలుస్తోంది.
ఆ బాధ్యత వారిదేనట..
గతంలో శిక్షణలు పూర్తయినవారి వివరాలు ఏపీఎస్ఎస్డీసీ(ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) వద్ద ఉండేవి. మేళాలు నిర్వహించి, వారికి అవకాశం కల్పించేవారు. తద్వారా కొలువుల కల్పన సులువయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. కేవలం శిక్షణ వరకే తమ బాధ్యతని, తరువాత ఉద్యోగాలు వారే చూసుకోవాలని చెబుతుండడం గమనార్హం.
అవకాశం కల్పిస్తున్నాం..
తరగతులకు హాజరైన అభ్యర్థులకు మేళాల్లో తొలి అవకాశం ఇస్తున్నాం. అలాగే నేరుగా కళాశాలల్లో నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ పాల్గొనేలా చూస్తున్నాం. గతంలో కొవిడ్ కారణంగా ఆగిపోయాయి. గతేడాది నుంచి పునఃప్రారంభించాం. ప్రస్తుతం నిలిపివేశాం. త్వరలో కొత్త కోర్సుల్లో శిక్షణ ఇస్తాం.
నీలం గోవిందరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రబంధకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్