logo

ఐక్యంగా వెళ్దాం.. జెండా ఎగరేద్దాం

కురుపాం నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేసి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని తెదేపా నాయకులు నినదించారు

Published : 17 Apr 2024 04:50 IST

సంఘీభావం తెలుపుతున్న జగదీశ్వరి, నాయకులు
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: కురుపాం నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేసి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని తెదేపా నాయకులు నినదించారు. కూటమి అభ్యర్థిని జగదీశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం గుమ్మలక్ష్మీపురం నుంచి ఎల్విన్‌పేట వరకు భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌- 6 పథకాల గురించి వివరించారు. జగదీశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్ల పాలనలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గిరిజనుల కోసం ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. రోడ్లు, తాగు, సాగునీటి వనరులను పట్టించుకోలేదన్నారు. ఆదివాసీ బిడ్డగా తనను ఆశీర్వదిస్తే మన్యంలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. రాష్ట్ర కార్యదర్శి వీరేశ్‌చంద్రదేవ్‌ మాట్లాడుతూ.. వైకాపా అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోవద్దని సూచించారు. గిరిజనులంతా ఏకమై గిరిజన మహిళను గెలిపించి చట్టసభల్లో అడుగు పెట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దత్తి లక్ష్మణరావు, మల్లేశ్వరరావు, సుదర్శనరావు, రామకృష్ణ, రంజిత్‌కుమార్‌, కృష్ణబాబు, పద్మావతి, భూషణరావు, కళావతి, తమ్మయ్య, రమణమూర్తి, దివాకర్‌, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు