జగన్ వేట.. ఓడిన ఆట
గొప్ప వనరులున్న ప్రాంతం ఉత్తరాంధ్ర అని పదే పదే అభివర్ణించే ముఖ్యమంత్రి జగన్.. ఈ ప్రాంత క్రీడాకారుల ఉన్నతిలో కీలక పాత్ర పోషించే రాష్ట్ర ఆదర్శ క్రీడా పాఠశాలను ఎందుకు ఎత్తేశారో చెప్పగలరా..? ఎన్నో ఆశలతో అడుగు పెట్టిన క్రీడాకారులను ఎందుకు తరిమేశారో చెప్పగలరా..
తెదేపా క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తే.. ఈ ప్రభుత్వం మూసేసింది...
పిల్లల కోసం నిర్మించిన భోజనశాల
విశాఖను రాజధానిగా చేసుకుని పాలిస్తా..గొప్ప వనరులున్న ప్రాంతం ఉత్తరాంధ్ర అని పదే పదే అభివర్ణించే ముఖ్యమంత్రి జగన్.. ఈ ప్రాంత క్రీడాకారుల ఉన్నతిలో కీలక పాత్ర పోషించే రాష్ట్ర ఆదర్శ క్రీడా పాఠశాలను ఎందుకు ఎత్తేశారో చెప్పగలరా..? ఎన్నో ఆశలతో అడుగు పెట్టిన క్రీడాకారులను ఎందుకు తరిమేశారో చెప్పగలరా..
- న్యూస్టుడే, విజయనగరం క్రీడలు
రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ క్రీడా పాఠశాల ఎప్పటి నుంచో కడపలో నడుస్తోంది. రెండోది కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం విజయనగరంలో ఆదర్శ క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4వ తరగతి నుంచి ప్రారంభించి.. నెమ్మదిగా ఇంటర్ వరకు ఉన్నతి పెంచాలని అనుకుంది. అందులో భాగంగా 2017-2018లో తొలి విడతగా రూ.20 కోట్లతో సువిశాలమైన 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విజ్జీలో ఏర్పాటుకు స్థలం కేటాయించింది.
కరోనా వంక
కరోనా సమయంలో పిల్లలను ఇంటికి పంపించేశారు. తర్వాత అన్నీ విద్యాసంస్థలు తెరిచినా ఈ పాఠశాలను తెరవలేదు. చదువు మధ్యలో ఆగిపోయిందని, తెరవకపోతే పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని తల్లిదండ్రులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కలిసి కాళ్లు, చేతులు పట్టుకుని వేడుకున్నారు. వారి పరిస్థితి చూసి పాఠశాలను తెరిచినా నిర్వహణ భారమవుతుందని అప్పటి క్రీడా అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. సొంత భవనంలోనే పాఠశాలను నడుపుతున్నారు..?, వసతి కూడా సొంత భవనాల్లోనే కదా కేటాయించారు..? పిల్లలకు, ఉపాధ్యాయుల భోజనాలకు, జీతాలకు, ఇతర ఖర్చులకు ఆ మాత్రం బడ్జెట్ కేటాయించలేరా..? ఇలా అర్ధాంతరంగా ఆపేస్తే పిల్లల భవిష్యత్తు ఏమిటని నిలదీశారు. అయినా ప్రభుత్వం మూసేసి పిల్లలను వెనక్కి పంపించేసింది.
విజ్జీ మైదానంలో మొండిగోడల మధ్య రాష్ట్ర ఆదర్శ క్రీడా పాఠశాల భవనం
వెంటనే తరగతులు ప్రారంభం
భవనాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక వసతి భవనం తీసుకుని అందులో తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు విజ్జీలో క్రికెట్ గ్రౌండులోని భవనంలో తరగతులు ప్రారంభించారు. 4, 5 తరగతి పిల్లలకు క్రీడా సాధన, విద్యాబుద్ధులు నేర్పాలని తలచగా.. రాష్ట్రం నలుమూలల నుంచి 40 మంది వచ్చి చేరారు. పాఠశాల నిర్వహణకు రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. 11 మంది ఉద్యోగులను నియమించింది. ముగ్గురు ఉపాధ్యాయులను తీసుకుంది. మరో వైపు క్రీడా పాఠశాలకు సంబంధించిన అన్ని భవనాల నిర్మాణాలకు సుమారు రూ.2 కోట్లు విడుదల చేయగా పనులు కూడా ప్రారంభమయ్యాయి.
శిక్షకులను తరిమేశారు
పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు పొరుగు సేవల విభాగంలో కొంతమంది శిక్షకులను నియమించింది. రాజీవ్, విజ్జీ మైదానాల్లో కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి వాకింగ్, సైక్లింగ్, అథ్లెటిక్స్ ట్రాక్లతో పాటు ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్బాల్, బాక్సింగ్, యోగా, తైక్వాండో, బ్యాడ్మింటన్ కోర్టులను నిర్మించింది. జిల్లాల విభజన పేరుతో శిక్షకులను ఇతర జిల్లాలకు తరిమేశారు. ఇటీవల నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నామని క్రీడాధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు.
మధ్యలోనే నిలిపేశారు..
విజ్జీలో తలపెట్టిన క్రీడా పాఠశాల భవన నిర్మాణ పనులైనా కొనసాగించారా..? అంటే అది కూడా మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఆ నిర్మాణం మొండిగోడలు, పిల్లర్లతో దర్శనమిస్తున్నాయి. ఉపాధ్యాయులను మాతృ సంస్థకు, పొరుగు సేవల విభాగంలో తీసుకున్న 11 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!