Sidda Raghava rao: శిద్దా.. కూటమి చెంతకు చేరకుండా!..
రెండు ప్రధాన రాజకీయ పక్షాల తరఫున జిల్లా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో దాదాపు తేలిపోయింది.
దర్శి అభ్యర్థిత్వంపై తెదేపా సర్వేలు
అనూహ్యంగా తాడేపల్లి నుంచి పిలుపు
పోటీకి చెక్ పెట్టిన వైకాపా నేతలు!
రాఘవరావు
ఈనాడు, ఒంగోలు- ఒంగోలు, న్యూస్టుడే: రెండు ప్రధాన రాజకీయ పక్షాల తరఫున జిల్లా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో దాదాపు తేలిపోయింది. ప్రతిపక్ష తెదేపా కూటమిలో దర్శి అసెంబ్లీతో పాటు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇదే తరుణంలో ఇప్పుడు మాజీ మంత్రి, వైకాపా నేత శిద్దా రాఘవరావు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. శిద్దా తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచే పోటీకి మొగ్గుచూపినా వైకాపా అధిష్ఠానం పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదోఒక సీటు నుంచి పోటీ చేయాలని చేసిన ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. చివరికి ఆ పార్టీ అన్నిచోట్లా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో శిద్దా మౌనంగా ఉండిపోయారు. ఈ దఫా తమ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉంటుందని సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. ఇటీవల ఒంగోలు, మార్కాపురం ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు కూడా దూరంగా ఉండటంతో ఆయన తెదేపా గూటికి చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. శిద్దా మాత్రం నోరు విప్పకుండా గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చారు.
ముగ్గురి పేర్లతో ఐవీఆర్ సర్వే...: ఈ పరిణామాలతో దర్శి నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ ఇప్పుడు తారస్థాయికి చేరింది. వైకాపా అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పేరును ఆ పార్టీ ప్రకటించడంతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. జనసేన నేత గరికపాటి వెంకట్ కొన్నాళ్లు విస్తృతంగా పర్యటించారు. పలు కార్యక్రమాలతో అక్కడి ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు. అనంతర కాలంలో ఆయన కూడా కార్యకలాపాలు చేపట్టకుండా నెమ్మదించారు. ఓ వైపు ఎన్నికలు తరుముకొస్తుండటం, కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో ఒంగోలుకు చెందిన శ్రీహర్షిణి విద్యాసంస్థల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్కు నియోజకవర్గ బాధ్యతలను తెదేపా కట్టబెట్టింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు కుమార్తె కడియాల లక్ష్మి పేరుపై కూడా చర్చ సాగింది. మరోమారు శిద్దా రాఘవరావు పేరు కూడా తెర పైకి వచ్చింది. ఈ ముగ్గురి పేర్లతో తెదేపా ఐవీఆర్ సర్వే కూడా నిర్వహించింది.
అప్రమత్తమైన ఆ ఇద్దరు..: తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని చెబుతూ వచ్చిన శిద్దా.. అంతర్గతంగా అందుకు భిన్నమైన వైఖరి అవలంబించారు. తనయుడు సుధీర్తో పాటు కుటుంబీకులతో చర్చించారు. ఈసారికి పోటీ వద్దని మెజారిటీ కుటుంబీకులు ఆయనకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ ఈ దఫా పోటీకి దూరం అంటూనే అంతర్గతంగా తెదేపాలో చేరికకు శిద్దా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. ఈ నెల 10న మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభకు ఆయన్ను తన కారులో వెంటబెట్టుకుని వెళ్లారు. వైకాపాలో ఉంటే భవిష్యత్తులో ఆయన వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అక్కడ చెప్పించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన తెదేపాలోకి రానున్నారనే ప్రచారానికి అడ్డుకట్ట పడలేదు. ఇంతలోనే శిద్దాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపొచ్చింది. బాలినేనితో కలిసి సీఎం జగన్తో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం శిద్దా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ వైకాపాలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. అంతకుమించి మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఇటు బాలినేని, అటు బూచేపల్లి మంత్రాంగంతో సీఎం వద్దకు పిలిపించి శిద్దా రాఘవరావు రాజకీయ భవిష్యత్తుకు చెక్ పెట్టారనే ప్రచారం సాగుతోంది. రానున్న రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు.. రాజకీయ పయనం ఎటువైపు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురివింద దొడ్లో అధికార మంద
[ 28-04-2024]
నా కుమారుడు ప్రణీత్రెడ్డి అమాయకుడు. అతను రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షగట్టారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ నిరాధారమైనవే. -
30న వై.పాలేనికి చంద్రబాబు
[ 28-04-2024]
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న యర్రగొండపాలెం రానున్నారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్రసహాయకుడు
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ ఉంటే మాకేమిటి అన్నట్లుగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా రాజకీయ నాయకులతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. -
పేదల ప్రాణం.. గాల్లో దీపం..
[ 28-04-2024]
వైద్యరంగానికి పెద్దపీట వేశానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా చెబుతుంటారు. అయితే ఇటు పీహెచ్సీలు, అటు ప్రధాన ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే దుర్భరంగా ఉంది. కానరాని వైద్య నిపుణులు..నామమాత్రంగా మందులు..మెరుగుపడని వసతులతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
వానొస్తే కుంట.. ఎండొస్తే కళ్ల మంట
[ 28-04-2024]
జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి పట్టణాలతో పాటు శ్రీశైలానికి వెళ్లాలంటే ఈ ఒంగోలు - కర్నూలు రోడ్డే గత్యంతరం. నిత్యం వేలాదిమంది ప్రయాణించే ఈ బాటను ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యంగా వదిలేశారు. -
క్వార్టర్ మద్యం కోసం మట్టుబెట్టాడు
[ 28-04-2024]
క్వార్టర్ మద్యం కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన యర్రగొండపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. 24 గంటల్లో పోలీసులు ఈ కేసులు ఛేదించారు. -
వైకాపా ప్రచారంలో ఉద్యోగులు
[ 28-04-2024]
గత మంగళవారం దర్శి మండలం చందలూరులో అధికార వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ చవలం రామాంజనేయులు, వాలంటీరు సింగంశెట్టి సతీష్లు పాల్గొన్నారు. -
శిద్దా ఇంట్లో దోపిడీకి విఫలయత్నం
[ 28-04-2024]
మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి విఫలయత్నం జరిగింది. అదనపు ఎస్పీ(క్రైమ్స్) ఎస్.వి.శ్రీధర్రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. -
‘నా.. నా’లుక వరకే మీరు
[ 28-04-2024]
‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా మాటలు చెప్పే జగన్.. చేతల్లో ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని వేదికలపై పలుకుతూ.. తన అయిదేళ్ల పాలనలో వారి బతుకులనే సంక్షోభంలో పడేశారు. -
గొంతెండుతున్న పల్లెలు
[ 28-04-2024]
నీటి ఎద్దడితో పల్లెల గొంతెండుతోంది. మండలంలోని పామూరిపల్లె, బాదినేనిపల్లె ఎస్సీ కాలనీ, హనుమంతరాయునిపల్లె గ్రామాల్లో నీటికి కటకటలాడుతున్నారు. పామూరిపల్లె ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా ట్యాంకు వాల్వు మరమ్మతులకు గురికావడంతో నీరు ఎక్కక నీరంతా వృథా అవుతోంది. -
ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం
[ 28-04-2024]
తర్లుపాడు మండలంలో తుమ్మలచెరువులో శనివారం కందు నారాయణరెడ్డి ప్రచారం చేట్టారు. ప్రచారరథంపై రెండు రోజులుగా తర్లుపాడు మండలంలో పర్యటిస్తున్నారు. -
నాడు ప్రగతి... నేడు ఆధోగతి
[ 28-04-2024]
ఎన్నికలకు ముందు ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచిపోయారు. -
గుండ్లకమ్మలో ఇసుక తోడేళ్లు
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైకాపా నాయకుల ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. పైపెచ్చు... గుండ్లకమ్మ పరిధిలో యంత్రాలతో మరింతగా తోడేస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నా... అటుగా వెళ్లి హెచ్చించిన దాఖాలాలు సైతం లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా