ప్రలోభాలకు లొంగొద్దు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని.. అటువంటి వజ్రాయుధాన్ని ప్రలోభాలకు లొంగి ఓడనీయొద్దని కలెక్టర్ దినేష్ కుమార్
కొమరోలు మండలం తాటిచెర్ల వాసులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్
గిద్దలూరు పట్టణం, కొమరోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని.. అటువంటి వజ్రాయుధాన్ని ప్రలోభాలకు లొంగి ఓడనీయొద్దని కలెక్టర్ దినేష్ కుమార్ , ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సూచించారు. కొమరోలు మండలం తాటిచెర్లలో సోమవారం పర్యటించారు. ఓటు హక్కు వినియోగంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఓటు హక్కును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పౌరులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
- గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్, ఎస్పీ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ పత్రాలు నింపిన తర్వాత సిబ్బందికి అందిస్తే పరిశీలించి తప్పిదాలుంటే తెలుపుతారన్నారు. ప్రచారాలకు ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తిస్తే చరవాణి నంబరు 91211 02266కు ఫిర్యాదు చేయాలని కోరారు. సీవిజిల్ యాప్లోనూ ఫిర్యాదులు అందజేయవచ్చని తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకుగాను ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. తొలుత గిద్దలూరు సెయింట్పాల్స్ బీఈడీ కళాశాల ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. భద్రతా చర్యలపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి డి.నాగజ్యోతి, డీఎస్పీ బాలసుందరరావు, సీఐ సోమయ్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్