‘చెవి’లో జోరీగ.. ప్రలోభాల్లో అనకొండ
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నానాపాట్లు పడుతోంది. ప్రజాస్వామ్యం అంటూ వేదికలపై గొప్పగా ప్రసంగాలు దంచే వైకాపా అభ్యర్థులు, నేతలు.. ఆచరణలో మాత్రం అపహాస్యానికి గురిచేస్తున్నారు.
ఓటర్లకు బొట్లు మొదలు బియ్యం బస్తాలు
ఆత్మీయ సమా వేశాలంటూ విందులు
బరితెగిస్తున్న అధికార పార్టీ నేతలు
పంపిణీకి సిద్ధంగా ఉంచిన చీర, ప్యాంట్, షర్టులు, గృహోపకరణాలు
ఈనాడు, ఒంగోలు: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నానాపాట్లు పడుతోంది. ప్రజాస్వామ్యం అంటూ వేదికలపై గొప్పగా ప్రసంగాలు దంచే వైకాపా అభ్యర్థులు, నేతలు.. ఆచరణలో మాత్రం అపహాస్యానికి గురిచేస్తున్నారు. రూ. కోట్ల విలువైన ప్రలోభాలను ఎరగా వేస్తూ ఓట్లు కొల్లగొట్టే కుతంత్రాలకు తెర లేపారు. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. అభ్యర్థుల ఖరారు పూర్తికావడమే తరువాయి మొదటి విడతగా డబ్బు వెదజల్లడం, కానుకలు పంచడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దిరోజులు విరామం ప్రకటించారు. తిరిగి ఇప్పుడు రెండో విడత ప్రలోభాల పర్వానికి రంగం సిద్ధం చేశారు. అయిదేళ్లపాటు అధికారంలో ఉండి అడ్డగోలుగా సంపాదించి జనం ‘చెవి’లో జోరీగలా మారారు. ఇప్పటికే ఎక్కడికక్కడ నగదు, బహుమతులతో భారీ డంప్లను సిద్ధం చేశారు. రూ.కోట్లు చెల్లించి సొంత నియోజకవర్గం నుంచి అద్దె కార్యకర్తలను తెచ్చుకున్నారు. తాజాగా ఖరీదైన కానుకలతో పాటు బొట్టు బిళ్లల నుంచి బియ్యం బస్తాల వరకు పంచుతున్నారు.
ముందుగానే ‘మందు’ పంపిణీ బాధ్యతలు...: ఆత్మీయ సమావేశాల పేరుతో నియోజకవర్గాల్లో భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారథులలను ఆహ్వానిస్తున్నారు. వారితో రాబోయే ఎన్నికల నిర్వహణపై మార్గదర్శనం చేస్తూ.. పార్టీ పరంగా ఎవరెవరు ఏమి చేయాలో సూచిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు పెద్ద ఎత్తున కానుకలు, నగదు ఎర చూపుతున్నారు. ఓటర్లకు మద్యం, నగదు, ఇతర బహుమతులు అందజేసే బాధ్యతను ఇప్పటి నుంచే అనుయాయులకు అప్పగిస్తున్నారు.
నామినేషన్ల నుంచి మళ్లీ మొదలు..!: వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రలోభాల పంపిణీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాక ముందే వాలంటీర్లు, వెలుగు, ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ సిబ్బందికి తాయిలాలు, నగదు, ఇతర బహుమతులు అందజేశారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో మళ్లీ తాయిలాల ఎరకు తెర లేపారు. ఇందులో భాగంగా నాలుగైదు ఓట్లు ఉన్న ఇళ్లకు 25 కిలోల బియ్యం బస్తా, ఒకరిద్దరు మహిళలుంటే బొట్టుబిళ్లలు, చెవిపోగులు, గృహోపకరణాలు, చీరలు, ప్యాంట్ షర్టులు, కుక్కర్లు, హాట్బాక్సులు, స్మార్ట్ వాచ్లు, బ్యాగుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. గిద్దలూరు, కనిగరి తదితర ప్రాంతాల్లో బొట్టుబిళ్లలు, చెవిపోగులతో పాటు గృహోపకరణాలు ఇప్పటికే అందజేశారు. కొత్తపట్నంలో కొందరు ఓటర్లకు ఇప్పటికే బియ్యం బస్తాలు చేర్చారు.
చోద్యం చూస్తున్న అధికారులు...: ఎన్నికల కోడ్కు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తిలోదకాలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి 12 వరకు ప్రచారం సాగిస్తున్నారు. ఈ విషయంపై తెదేపా నాయకులు సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవు. ఒంగోలులో సమతానగర్లోనూ అధికారులు ఇదే తీరు ప్రదర్శించారు. ఇటీవల జీజీహెచ్ వద్ద రాత్రి 12 వరకు పెద్దసంఖ్యలో వైకాపా నాయకులు, శ్రేణులు మోహరించినా కట్టడి చేయకుండా మిన్నకుండిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్