ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది.!
గ్రామీణ ప్రాంతాల నిరుపేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యనందించేందుకు రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సమయం ఆసన్నమైంది
ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల
న్యూస్టుడే, ఎచ్చెర్ల: గ్రామీణ ప్రాంతాల నిరుపేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యనందించేందుకు రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సమయం ఆసన్నమైంది. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు 2023- 24 విద్యాసంవత్సరంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందేందుకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఈ ఏడాది 1,100 సీట్లు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకప్పుడు రాష్ట్రంలో ఇడుపులపాయ, నూజివీడులలో మాత్రమే రెండు ట్రిపుల్ ఐటీలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి తెదేపా ప్రభుత్వం మరో రెండు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయగా అందులో ఒకటి 2016-17 విద్యాసంవత్సరంలో శ్రీకాకుళంలో నెలకొల్పింది. ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల విద్యార్థులకు తక్కువ దూరంలోనే నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చినట్లయింది.
డిజిటల్ తరగతి గదుల్లో బోధన..
ఆర్జీయూకేటీలో విద్యార్థులకు ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సును అందిస్తున్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో డిజిటల్ తరగతి గదుల్లో లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో విద్యాభ్యాసం జరుగుతుంది. మొదటి రెండేళ్లు ఇంటర్తో సమానమైన పీయూసీ- 1, పీయూసీ- 2 కోర్సును పూర్తి చేయాలి. తరువాత ఇంజినీరింగ్లో ప్రవేశాలు పొంది నాలుగేళ్లు చదవాలి. ఒకవేళ మొదటి రెండేళ్ల తరువాత ఇంటర్తోనే విద్యార్థి బయటకు వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. నిత్యం ఆన్లైన్లో విద్యాభ్యాసం సాగించే విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ఉదయం వ్యాయామం, యోగా, క్రీడలతో విద్యార్థుల రోజువారీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం క్రీడలు, సంగీతం, నృత్యం వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి.
ఏర్పాటై ఏడేళ్లు పూర్తి..
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు ఏడు బ్యాచ్లకు ప్రవేశాలు కల్పించగా ఆరేళ్ల కోర్సును పూర్తి చేసుకొని రెండు బ్యాచ్లు బయటకు వచ్చాయి. సంస్థను శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినప్పటికీ వసతులు, భవనాలు లేకపోవడం.. స్థలం కేటాయింపు జరగకపోవటంతో మొదటి రెండు బ్యాచ్లకు నూజివీడులో తరగతులు ప్రారంభించారు. ఎచ్చెర్ల మండలం షేర్మహ్మద్పురంలో రాజీవ్ యువకిరణాలు భవనాల్లో 2018-19 ఏడాదిలో పీయూసీ- 2 బ్యాచ్తో స్థానికంగా తరగతులు ప్రారంభించారు. ఈ భవనాలను ఆనుకొని ఉన్న కొండపై 200 ఎకరాలను ట్రిపుల్ ఐటీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ- 1, 2, ఇంజినీరింగ్- 1, 2 బ్యాచ్లకు తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన ఇంజినీరింగ్- 3, 4 బ్యాచ్లకు నూజివీడులోనే తరగతులు జరుగుతున్నాయి.
వారికి అదనంగా 4 శాతం మార్కులు..
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక విద్యనందించాలనే లక్ష్యంతో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు అదనంగా 4 శాతం మార్కులు జోడించి ఎంపిక జాబితా ప్రకటిస్తాం. జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా కోర్సులో మార్పులు చేశాం. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక ప్రాంగణాల మధ్య విద్యార్థులకు అంతర్గత బదిలీ అవకాశం లేదు. కౌన్సెలింగ్ తేదీలతో సహా పూర్తి సమాచారం www.rgukt.in వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.
ఆచార్య కె.సి.రెడ్డి, కులపతి, ఆర్జీయూకేటీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం జాగాలపైకి జ‘గన్’..!
[ 05-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత భూఆక్రమణలకు కొదవ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే అధికార మదంతో కబ్జా చేసేస్తున్నారు. ప్రశ్నిస్తే వివాదాలకు దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసేందుకు జగన్ కొత్త ఎత్తుగడతో జనాల ముందుకు వస్తున్నారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1,500
[ 05-05-2024]
‘వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కేసులతో వేధింపులకు గురిచేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేశారు. -
‘దీవెన’ పేరుతో దగా!
[ 05-05-2024]
జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క. -
పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం
[ 05-05-2024]
వైకాపా నాయకులు పోర్టు నిర్మాణం పేరుతో ఈ ప్రాంత సహజ వనరులను దోచుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం
[ 05-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శనివారం ప్రారంభమైంది. మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలో ప్రక్రియ నిర్వహించారు. -
చంద్రబాబుతోనే ప్రగతి సాధ్యం
[ 05-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తేనే రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని సినీ నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. -
అవే బాధలు.. అందలేదు డబ్బులు
[ 05-05-2024]
పింఛను ఇబ్బందులు ఇంకా తీరలేదు. ఇప్పటికీ వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మేడలపై ఉన్న బ్యాంకులు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. -
ఎత్తిపోతలపై కన్నెత్తి చూడని ప్రభుత్వం..!
[ 05-05-2024]
కాలువల సదుపాయం లేని వ్యవసాయ భూములకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. దీనిని గుర్తించిన తెదేపా ప్రభుత్వ వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నిధుల మంజూరుతో పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీరాయి. -
ఒకేసారి ఇద్దరు,ముగ్గురు ఓటు
[ 05-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం గందరగోళంగా సాగింది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నాలుగు మండలాల ఉద్యోగుల కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే ఉద్యోగుల తాకిడి పెరిగింది. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
[ 05-05-2024]
బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు