Vishal: విశాల్ కొత్త రాజకీయ పార్టీ?
ప్రముఖ నటుడు విశాల్ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. ఆయన మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు.
సైదాపేట, న్యూస్టుడే: ప్రముఖ నటుడు విశాల్ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. ఆయన మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్ తిరస్కరించారు. తన అభిమాన సంఘాన్ని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’(విశాల్ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జులను నియమించారు. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు షూటింగ్లకు వెళ్లినప్పుడు విశాల్ అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తూ, పరిష్కరిస్తూ వస్తున్నారు. త్వరలో విశాల్ మక్కల్ నల ఇయక్కం నిర్వాహకులను చెన్నైకి పిలిపించి సమాలోచన జరపనున్నట్లు సమాచారం. వారితో మాట్లాడి పార్టీని విశాల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్లాగే విశాల్ కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలవరని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాతృత్వం అమోఘం
[ 09-05-2024]
ఐఐటీ మద్రాస్ అంటేనే ఒక ప్రత్యేక ముద్ర. వారు నిర్వహించే ప్రాజెక్టులకు ఎంతో ప్రజాదరణ. ఇక్కడ చదివిన విద్యార్థులంటే పెద్దపెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతాయి. మరీ ముఖ్యంగా కంపెనీలు పెట్టాలనే ఆలోచనలు ఇక్కడి విద్యార్థుల్లో ఉంటాయి. -
విద్యార్థులకు ప్రతినెలా రూ.1000
[ 09-05-2024]
ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతవిద్యకు వెళ్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1000 అందించే ‘తమిళ్ పుదల్వన్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్దాస్ మీనా తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే వేలాయుధన్ కన్నుమూత
[ 09-05-2024]
తమిళనాడు భాజపా ఎమ్మెల్యే వేలాయుధన్(73) మృతి చెందారు. 1996 శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పోటీచేశారు. కన్నియాకుమరి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వేలాయుధన్ గెలుపొందారు. -
ఆర్థిక అసమానతలు పెరిగాయి: అన్బుమణి
[ 09-05-2024]
డీఎంకే, అన్నాడీఎంకే పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తెలిపారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. -
ఇరాన్ నుంచి కొచ్చికి..
[ 09-05-2024]
ఇరాన్ నుంచి తప్పించుకుని 3 వేల కి.మీ. సముద్రంలో ప్రయాణించి కేరళ సముద్రతీరానికి చేరుకున్న తమిళనాడు జాలర్లను కోస్ట్గార్డ్ రక్షించింది. -
మలయాళంలోకి స్టాలిన్ స్వీయచరిత్ర
[ 09-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ‘ఉంగళిల్ ఒరువన్’ పేరిట రాసిన స్వీయచరిత్ర పుస్తకాన్ని మలయాళంలోకి అనువదించారు. బాబురాజ్ కళంబూర్ అనువదించిన పుస్తకాన్ని డీసీ బుక్స్ పబ్లికేషన్స్ ప్రచురించింది. -
వివాహానికి జాతకానికంటే రక్తపరీక్షే ముఖ్యం
[ 09-05-2024]
వివాహానికి జాతక అనుకూలత కంటే రక్తపరీక్షే ముఖ్యమని ప్రముఖ నటి సుహాసిని తెలిపారు. రక్తహీనత దినం సందర్భంగా తలసేమియా నల సంఘం ప్రజల్లో అవగాహన కల్పించేలా అపోలోలో కార్యక్రమం ఏర్పాటు చేసింది. -
పీటీ మాస్టర్ పాట వీడియో విడుదల
[ 09-05-2024]
సంగీత దర్శకుడు, నటగాయకుడు హిప్హాప్ ఆది నటిస్తున్న చిత్రం ‘పీటీ మాస్టర్’. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించగా హిప్హాప్ ఆది సంగీతం సమకూర్చారు. -
గడువు తీరిన బీరు తాగి యువకుల అస్వస్థత
[ 09-05-2024]
మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీప తెన్నంగుడిలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇద్దరు యువకులు రెండు రోజుల క్రితం బీరును కొనుగోలు చేసి తాగారు. అది తాగిన కొద్ది సేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. -
జారవిడుచుకున్న బ్యాగు అప్పగింత
[ 09-05-2024]
మదురై సెంట్రల్ జైలు తరఫున నిర్వహిస్తున్న హోటల్లో ప్రతిరోజు చాలా మంది ఆహారం తిని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్, అతని భార్య శ్రీ గంగాలు కుటుంబంతో కలిసి తమిళనాడును సందర్శనకు వచ్చారు. -
సవుక్కు శంకర్పై మరో రెండు కేసులు
[ 09-05-2024]
యూట్యూబర్ సవుక్కు శంకర్పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను కోయంబత్తూరు పోలీసులు ఇదివరికే అరెస్టు చేశారు.