చిత్రవార్తలు
కార్తిక మాసం ముగింపు సందర్భంగా ప్రజలు పోలి పాడ్యమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలనుంచే సమీపంలోని చెరువులు, కాలువల
దీపశోభితం
అభిషేకం చేస్తున్న పురోహితులు
అనకాపల్లి, నక్కపల్లి, న్యూస్టుడే: కార్తిక మాసం ముగింపు సందర్భంగా ప్రజలు పోలి పాడ్యమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలనుంచే సమీపంలోని చెరువులు, కాలువల వద్ద దీపాలు వదిలారు. ఉపమాక బంధుర సరస్సు వద్దకు వందలాది తరలి వచ్చి దీపాల కాంతుల్లో సరస్సు దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం పూజలు చేసిన భక్తులు పండితులకు దీప, స్వయంపాక దానాలు సమర్పించారు. నక్కపల్లి-ఉపమాక రోడ్డు జనాలతో కిటకిటలాడింది. అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో పోలి పాడ్యమి సందర్భంగా రుత్విక్కులు జాడ జగదీష్శర్మ ఆధ్వర్యంలో లక్ష లింగాలతో ఘనంగా పూజలు చేశారు. పరమేశ్వరుని ఐదు ముఖాలకు అభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి బుద్ద నగేష్ పాల్గొన్నారు.
దీపకాంతులతో ఉపమాక చెరువు
పవిత్ర పుష్కరిణి.. ఆధ్యాత్మిక జ్యోతిర్మయి..
ఉత్తరవాహిని తీరంలో సందడి
సింహాచలం, న్యూస్టుడే: మార్గశిర మాసాన్ని ఆహ్వానిస్తూ ఆదివారం అప్పన్న స్వామి వరాహ పుష్కరిణిలో పోలి పాడ్యమి వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. వేకువజాము నుంచే నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కుటుంబాలతో వచ్చి చెరువు గట్టుపై దీపారాధనలు చేసి పూజలు చేశారు. అరటి డొప్పల్లో దీపాలు ఉంచి పుష్కరిణి జలాల్లో విడిచిపెట్టి కార్తిక దామోదరుడిని స్మరించుకున్నారు. సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
కార్తిక దీపాలతో కళకళ
పుష్కరిణి వద్ద భక్తజన సందోహం
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: నర్సీపట్నంలోని పవిత్ర ఉత్తరవాహిని తీరం భక్తులతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే మహిళలు నదిలో కార్తిక దీపాలు వదిలారు. ఇక్కడి పాకలపాడు గురుదేవుల ఆశ్రమం, సత్యనారాయణస్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారాయి. స్థానిక ఏఎస్సై గంగరాజు నేతృత్వంలో సిబ్బంది ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
నీ దివ్య తేజం చూసిన చాలును..
అమ్మవారికి హారతి ఇస్తున్న స్వాత్మానందేంద్ర సరస్వతి
విశాఖపట్నం, న్యూస్టుడే: బంగారు తల్లి.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు నెల రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొవిడ్ నిబంధనల కారణంగా మహాద్వారం నుంచే దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉదయం 10.01గంటలకు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్కుమార్ జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం అర్చకులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. ఆలయ వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, వేద, సప్తశతీపారాయణం, లక్ష్మీహోమం నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను తితిదే అధికారి తెచ్చారు. పట్టువస్త్రాలు గురువారం రోజున అమ్మవారికి అలంకరించనున్నారు. కార్యక్రమంలో ఈఓ ఎస్.జె. మాధవి, ఏఈఓలు వి.రాంబాబు, పి.రామారావు, డీఈఈ సిహెచ్.వి.రమణ, పర్యవేక్షకులు అప్పలనర్సింహరాజు, వైకాపా దక్షిణ నియోజకవర్గ నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్, మాజీ ఛైర్మన్ జెర్రిపోతుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
[ 26-04-2024]
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..