ఇళ్లు కట్టొద్దని బెదిరింపు
అది భీమిలి మండలం చిట్టివలస పంచాయతీలోని ప్రాంతం. ఇక్కడ ఓ చోట ఉన్న దాదాపు 30 ఎకరాల భూమిని కొందరు గతంలో కౌలుకు తీసుకొన్నారు. సంబంధిత యజమానితో మాట్లాడుకొని అధికారికంగా పలువురు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాదాపు వంద కుటుంబాలకుపైగా జీవనం సాగిస్తున్నారు.
ఈనాడు, విశాఖపట్నం
అది భీమిలి మండలం చిట్టివలస పంచాయతీలోని ప్రాంతం. ఇక్కడ ఓ చోట ఉన్న దాదాపు 30 ఎకరాల భూమిని కొందరు గతంలో కౌలుకు తీసుకొన్నారు. సంబంధిత యజమానితో మాట్లాడుకొని అధికారికంగా పలువురు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాదాపు వంద కుటుంబాలకుపైగా జీవనం సాగిస్తున్నారు. మూడు తరాలుగా అక్కడే ఉంటున్నారు. భూములకు విలువ పెరగడం, తగరపువలస నుంచి భీమిలికి వెళ్లే రహదారిలో ఆ ప్రాంతం ఉండడంతో ఇక్కడి స్థలాలపై కొందరి కన్ను పడింది. ఓ నేత బంధువు ఓ ఒప్పంద పత్రాన్ని సృష్టించి తమ స్థలాలు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. దాన్ని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నంలో బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనిపై ఇప్పటికే పోలీసు కేసులున్నాయని చెబుతున్నారు.
అనుమతులు తెచ్చుకున్నా హెచ్చరికలు!
పనులకు అడ్డుతగులుతూ: కొన్నేళ్ల కిందటే గృహాలు నిర్మించుకొని ఉంటున్న తమను కొందరు పలు రకాలుగా బెదిరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిర్మాణ పనులు చేపట్టినా, బోర్లు తవ్వినా అడ్డుతగిలి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని వాపోతున్నారు. తాముంటున్న స్థలాలు వారివంటూ భయపెడుతున్నా రన్నారంటున్నారు. భవన నిర్మాణ పనులకు జీవీఎంసీ జోనల్ కార్యాలయం నుంచి ప్లాన్ అనుమతి తెచ్చుకున్నా పనులు నిలిపేయాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. తరచూ వివాదాలు సృష్టించి తమను ఎన్నో విధాల అవస్థలపాలు చేస్తున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసుల దృష్టికీ ఈ విషయం తీసుకువెళ్లామంటున్నారు.
మ్యుటేషన్కు ప్రయత్నించి
చిల్లిపేట గ్రామంలో కొన్ని సర్వే నంబర్లలోని భూములను రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి గతంలో మ్యూటేషన్కు సైతం ప్రయత్నించడం గమనార్హం. రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పేర్లు మార్చే ప్రయత్నం చేశారు. దానిపై అప్పటి కలెక్టర్ వివరాలు తెప్పించుకొని ఆ స్థలాలు మరొకరి పేరున ఉండడంతో మ్యూటేషన్ కుదరదని దరఖాస్తును తిరస్కరించారు.
కొనేవారూ భయపడుతున్నారు
‘పదిహేను సంవత్సరాల కిందటే ఇల్లు నిర్మించుకున్నాం. మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇటీవల ఎవరెవరో వచ్చి ఇల్లు ఖాళీ చేస్తారా? లేదా అని గద్దిస్తున్నారు. ఇంటి పక్కనే పదిహేను సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కుమార్తెల వివాహాలకు ఉపయోగపడుతుందనుకున్నాం. బెదిరింపులు వస్తుండటంతో కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’ అని ఒకరు వాపోయారు.
ఆపేందుకు ప్రయత్నించి
‘ఇక్కడి స్థలాన్ని సంబంధిత యజమాని నుంచి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇక్కడ అన్ని రకాల అనుమతులతో ఇల్లు నిర్మిస్తుంటే కొందరొచ్చి అడ్డుకుంటున్నారు. నిర్మించకూడదని పత్రం రాసిస్తే ఆపేస్తామని చెబితే వెనక్కు తగ్గారు’ అని మరొకరు ఇక్కడి పరిస్థితిని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
[ 26-04-2024]
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!