logo

గ్యాస్‌ ఇబ్బందుల్లేకుండా గోదాముల ఏర్పాటు

గిరిజనులకు గ్యాస్‌ ఇబ్బందుల్లేకుండా గోదాములు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి తెలిపారు. జి.మాడుగుల మండల కేంద్రంలోని కొత్తూరులో గిరిజన సహకార....

Published : 23 Jan 2022 04:22 IST


గోదామును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జీసీసీ, ట్రైకార్‌ ఛైర్‌పర్సన్లు శోభా స్వాతిరాణి, బుల్లిబాబు తదితరులు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: గిరిజనులకు గ్యాస్‌ ఇబ్బందుల్లేకుండా గోదాములు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి తెలిపారు. జి.మాడుగుల మండల కేంద్రంలోని కొత్తూరులో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో గ్యాస్‌ గోదామును శనివారం వారు ప్రారంభించారు. ఆదివారం నుంచి వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా చేస్తామని చెప్పారు. జీసీసీ ఉత్పత్తులనే కొనుగోలు చేసేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు నర్సింగరావు, ఎంపీపీ పద్మ, పాడేరు మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ గాయత్రి, పాడేరు జీసీసీ డీఎం పార్వతమ్మ, బ్రాంచి మేనేజర్‌ కృపానందం, సర్పంచి రాంబాబు, ఉప ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీడీవో వెంకన్నబాబు, అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని