రాజీకి రమ్మని.. మారణాయుధాలతో కొట్టిచంపారు
మన మధ్య గొడవలెందుకు రాజీ చేసుకుందామన్నారు. ఫలానా ప్రాంతానికి వస్తే మాట్లాడుకుందామని సమాచారం ఇచ్చారు. తీరా వచ్చాక మారణాయుధాలతో కొట్టి చంపారు. రైల్వే మైదానంలో జరిగిన ఆర్.సాయితేజ హత్యకు సంబంధించి పోలీసులు....
సాయితేజ హత్య కేసులో ఏడుగురు అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సుమిత్ సునీల్, చిత్రంలో ఏడీసీపీ గంగాధరం, ఏసీపీ పెంటారావు
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే : మన మధ్య గొడవలెందుకు రాజీ చేసుకుందామన్నారు. ఫలానా ప్రాంతానికి వస్తే మాట్లాడుకుందామని సమాచారం ఇచ్చారు. తీరా వచ్చాక మారణాయుధాలతో కొట్టి చంపారు. రైల్వే మైదానంలో జరిగిన ఆర్.సాయితేజ హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. హత్యకు దారితీసిన పరిస్థితులను డీసీపీ డాక్టర్ సుమిత్సునీల్, ఏడీసీపీ(క్రైమ్) గంగాధరం, ఏసీపీ(క్రైమ్) పెంటారావులు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి..
మర్రిపాలెంకు చెందిన ఆర్.సాయితేజ(23) ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. మూడు నెలల క్రితం సాయితేజ బంధువును మర్రిపాలెంకు చెందిన బంగార్రాజు(21) కొట్టబోతుంటే అడ్డుకొని తిరిగి కొట్టాడు. అందరి ముందు తనను కొట్టాడని సాయితేజపై బంగార్రాజు కక్షపెట్టుకున్నాడు. అయితే ఈనెల 26వ తేదీ సాయంత్రం సాయితేజ తన స్నేహితులైన బాలు, హరిలతో కలిసి మహతకాలనీకి వచ్చాడు. అక్కడ బంగార్రాజు స్నేహితులైన బి.మోహన్, ఎస్.సురేష్లతో గొడవపడ్డాడు. అప్పటికే ఒకసారి అవమానంపాలై ఉన్న బంగార్రాజు మరింతగా కోపం పెంచుకొని సాయితేజను ఎలాగైనా హతమార్చాలని అతని స్నేహితులు మహ్మద్ యూసఫ్ ఖాన్, వి.రవికుమార్, పి.జయంత్, బి.మోహన్, సంపతిరావు సురేష్, సీపన సురేష్, ఒక బాలుడుతో కలిసి పథకం పన్నాడు. మోహన్, సురేష్తో గొడవపడిన రోజు (26వ తేదీ) రాత్రే సాయితేజ అతని స్నేహితుడు మణి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ వేడుకలు ముగిశాక బంగార్రాజు బృందానికి చెందిన మోహన్ సాయితేజకు ఫోన్ చేసి గొడవలు వద్ధు. రాజీపడదామని చెప్పి రైల్వే మైదానం వద్దకు రావాలని సమాచారమిచ్చాడు. అప్పటికే కత్తులు, రాడ్లు, కర్రలతో బంగార్రాజు బృందం సిద్ధంగా ఉంది. సాయితేజ మరో నలుగురు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై వారు రమ్మన్నచోటకు వచ్చాడు. ఆ సమయంలో కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం బంగార్రాజు బృందం మారణాయుధులు తీసి దాడి చేస్తుండంతో అక్కడి పరిస్థితిని చూసి సాయితేజతో వచ్చిన స్నేహితులు పారిపోయారు. తర్వాత సాయితేజను వారు కొట్టి చంపేశారు. పోలీసులు ఈ సంఘటనలో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, వారిలో బాలుడు ఇంకా దొరకలేదు. నిందితులపై దాడి చేసిన సాయితేజ స్నేహితులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
జగన్ ఏలుబడిలో... అంగన్వాడీల అగచాట్లు
[ 07-05-2024]
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. -
ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల
[ 07-05-2024]
ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
వైకాపా హయాంలో..అన్నీ నేరాలే!
[ 07-05-2024]
వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ విమర్శించారు. -
మూడు పార్టీల కూటమితోనే ఉత్తరాంధ్ర ప్రగతి
[ 07-05-2024]
‘యువత సైకిల్ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
సమస్యల్లో పరవాడ ‘మేజర్’
[ 07-05-2024]
పరవాడ మేజర్ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. -
శిశువులపై జగన్ కర్కశత్వం
[ 07-05-2024]
జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. -
చీకట్లో పోలింగ్ కేంద్రాలు.. కనిపించని గుర్తులు
[ 07-05-2024]
ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. -
పింఛన్ లబ్ధిదారులకు తీరని అవస్థలు
[ 07-05-2024]
పింఛన్ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి. -
మాజీ పోలీసు ఇంట్లో రూ.9.99 లక్షలు స్వాధీనం
[ 07-05-2024]
జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎస్టీ) స్వాధీనం చేసుకుంది. -
చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు
[ 07-05-2024]
ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్ సూచించారు. -
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
[ 07-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!