సొంతింటి కల సాకారానికి సరైన వేదిక
మహానగరంలో సొంతింటిని సమకూర్చుకోవాలనుకునే వారికి ‘స్థిరాస్తి ప్రదర్శన’లు చక్కగా ఉపయోగపడతాయని విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్ కె.రామమోహనరావు పేర్కొన్నారు. ప్రజల అభిరుచులు, కొనుగోలు సామర్థ్యం పెరగడంతో నచ్చిన గృహాలను ఎంపిక చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమన్నారు.
విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్ కె.రామమోహనరావు
ఘనంగా ఆరంభమైన ‘ఈనాడు గ్రాండ్ ప్రాపర్టీ ఎక్స్పో’
ప్రదర్శన వివరాలు తెలుసుకుంటున్న రామమోహనరావు.... స్టాల్స్ వద్ద సందర్శకులు
ఈనాడు, విశాఖపట్నం: మహానగరంలో సొంతింటిని సమకూర్చుకోవాలనుకునే వారికి ‘స్థిరాస్తి ప్రదర్శన’లు చక్కగా ఉపయోగపడతాయని విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్ కె.రామమోహనరావు పేర్కొన్నారు. ప్రజల అభిరుచులు, కొనుగోలు సామర్థ్యం పెరగడంతో నచ్చిన గృహాలను ఎంపిక చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. నోవాటెల్ హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘ఈనాడు గ్రాండ్ ప్రాపర్టీ ఎక్స్పో-22’ను శనివారం ఉదయం రామమోహనరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు టైటిల్ స్పాన్సర్గా ఎంకే బిల్డర్స్-ఎంకే వన్ ప్రాజెక్టు, అసోసియేట్ స్పాన్సర్లుగా భూమాత రియల్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్, హనీ గ్రూప్ వ్యవహరిస్తున్నాయి. ఇందులో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. రామమోహనరావు మాట్లాడుతూ ‘ప్రజల కనీస అవసరాల్లో సొంతిల్లు కూడా ఒకటి. ప్రజల కలను నెరవేర్చే రియల్ ఎస్టేట్ బిల్డర్లు నాణ్యత, నమ్మకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా అందుబాటు ధరల్లో అందించాలి. రియల్ ఎస్టేట్ రంగం విస్తరణతో మౌలికవసతులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఇక్కడ స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. దీంతో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుంది. విశాఖ నగరాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు స్థిరాస్తిరంగం దోహదపడుతుంది’ అన్నారు. అంతకుముందు ఆయన ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి వారి ప్రత్యేకత తెలుసుకున్నారు. ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎంతకు విక్రయిస్తున్నారు, కొనుగోలుదారుల ఆసక్తి వంటి అంశాలపై ఆరాతీశారు. ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించిన ఈ ప్రదర్శనలో ఎంకే బిల్డర్స్ అధినేత రత్నయ్య, ‘ఈనాడు’ అసోసియేట్ వైస్ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్, ఈనాడు ఏపీ మార్కెటింగ్ హెడ్ ఎ.వెంకటేశ్వరరావు, యూనిట్ మేనేజర్ ఎన్.శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఓ స్టాల్
* భూమాత రియల్ ఎస్టేట్ గ్రూప్ డైరక్టర్ తాళ్లూరి శివాజి మాట్లాడుతూ ‘ కొవిడ్ తరువాత రియల్టర్లు, బిల్డర్లను ఒక వేదిక మీదకు తీసుకురావడం శుభపరిణామం.శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో ఇటువంటి కార్యక్రమం ద్వారా నగర అభివృద్ధిలో భాగస్వాములం కావొచ్చు. నమ్మకమైన స్థిరాస్తి సంస్థలన్నింటినీ ఒక చోటకు చేర్చడం వల్ల కొనుగోలుదారులకు ఎంతో వెసులుబాటు కల్పించినట్లే. ఎక్కడ ఏ తరహా ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయో తెలుసుకోవచ్చు’ అన్నారు. భూమాత ఆధ్వర్యంలో ఇప్పటివరకు 40 వెంచర్లు సామాన్య ప్రజల నుంచి అందరికీ అందుబాటులో విక్రయించామన్నారు.
ప్రారంభోత్సవానికి హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులు, సందర్శకులు
* ఎంకే బిల్డర్స్ అధినేత కె.రామకృష్ణారావు మాట్లాడుతూ కొవిడ్ తరువాత నగరంలో మొదటిసారి స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రజలకు మంచి అవకాశం. నగరంలోని ప్రముఖ నిర్మాణ ప్రాజెక్టులను ఒకే వేదిక మీదకు తీసుకురావడంతో నచ్చిన వాటిని నచ్చిన ధరకు కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. ఎంకే వన్ ప్రాజెక్టును అత్యంత వినూత్నంగా, అత్యాధునిక వసతులతో చేపడుతున్నాం’ అని చెప్పారు. నాలుగు బ్లాకుల్లో 25 అంతస్తులతో 800 ఫ్లాట్లు నిర్మిస్తున్నామన్నారు.
* హనీ గ్రూప్ అధినేత ఓబుల్రెడ్డి మాట్లాడుతూ ‘ప్రజలు నచ్చిన గృహ నిర్మాణాలను ఎంపిక చేసుకునేందుకు ఇది సరైన వేదిక. ముఖ్యంగా ఫ్లాట్స్ కొనుగోలు చేయాలనుకునే వారు ఒక చోట పరిశీలించి నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఏ ప్రాంతాల్లో ఏ ఫ్లాట్స్ ధర ఎంత ఉంది, వాటి విస్తీర్ణం, సౌకర్యాలను నేరుగా తెలుసుకోవచ్చు. అన్ని రంగాల్లో విశాఖ ముందుకు వెళుతోంది’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం