logo

విశాఖ-రాయ్‌పూర్‌ పాసింజర్‌ రద్దు

తూర్పు కోస్తా రైల్వే పరిధి సంబల్‌పూర్‌ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు విశాఖ-రాయ్‌పూర్‌ (08528) పాసింజరు రైలు, 15 నుంచి 21వ తేదీ వరకు రాయ్‌పూర్‌-విశాఖ పాసింజర్‌(08527) రైలును రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి తెలిపారు.

Published : 05 Oct 2022 04:44 IST

రైల్వేస్టేషన్‌ (కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: తూర్పు కోస్తా రైల్వే పరిధి సంబల్‌పూర్‌ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు విశాఖ-రాయ్‌పూర్‌ (08528) పాసింజరు రైలు, 15 నుంచి 21వ తేదీ వరకు రాయ్‌పూర్‌-విశాఖ పాసింజర్‌(08527) రైలును రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 15 నుంచి నిజాముద్దీన్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను గంటన్నరపాటు రీషెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించారు. టిట్లాఘర్‌- జగదల్‌పూర్‌ మధ్య ఆరు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని