logo

‘భారత రాజ్యాంగ రక్షణకు ఉద్యమించాలి’

భారత రాజ్యాంగ రక్షణ, దేశ స్వావలంబనకు ఉద్యమించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు వామపక్ష శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 27 Jan 2023 03:11 IST

నిరసన ప్రదర్శనలో మాట్లాడుతున్న బీవీ రాఘవులు

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ రక్షణ, దేశ స్వావలంబనకు ఉద్యమించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు వామపక్ష శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో.. భాజపా ప్రభుత్వం భారత రాజ్యాంగ ధ్వంసాన్ని ఆపాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను, కార్మిక, కర్షకులు తిప్పికొట్టాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.లోకనాధం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని