499 మందికి గణతంత్ర పురస్కారాలు
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రతినిధులు దాదాపు 499 మంది గణతంత్ర దినోత్సవ పురస్కారాలను అందుకున్నారు.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీచేస్తున్న కలెక్టర్,జేసీ, సీపీ
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రతినిధులు దాదాపు 499 మంది గణతంత్ర దినోత్సవ పురస్కారాలను అందుకున్నారు. పోలీసు కవాతు మైదానంలో గురువారం ఉదయం జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ఎ.మల్లికార్జున, సీపీ సిహెచ్.శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, జేసీ విశ్వనాథన్ తదితర అధికారుల సమక్షంలో ఆయా పురస్కారాలను అధికారులు, ఉద్యోగులు అందుకున్నారు. జీవీఎంసీలో 59 మందికి, పోలీసు విభాగంలో 62 మందికి, రెవెన్యూ విభాగంలో58 మందికి అవార్డులు లభించాయి.
కలెక్టర్, సీపీలతో అవార్డులు అందుకున్న పోలీస్ అధికారులు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు: విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంపొందించే ప్రదర్శనలు అలరించాయి. సేక్రెర్డ్ హార్ట్ హైస్కూలు, విజయం స్కూలు, కేజీబీవీ స్కూలు, ఏపీ బాలయోగి గురుకులం (మేఘాద్రిగెడ్డ), ప్రభుత్వ క్వీన్మేరీ పాఠశాల, కేజీబీవీ పాఠశాల విద్యార్థులు (భీమిలి) సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. నేచర్ క్యూర్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో యోగ ప్రక్రియలు నిర్వహించారు. బాలలకు బహుమతులు అందజేసి కలెక్టర్, సీపీ అభినందించారు.
* అల్పాదాయ వర్గాలకు కలెక్టర్ ఆస్తులను పంపిణీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ. 24.65 కోట్ల విలువ చేసే రుణాలను అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పది మందికి వినికిడి పరికరాలు, టచ్ఫోన్, ల్యాప్టాప్ పరికరాలను పంపిణీ చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్ సందర్శించారు. మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను కలెక్టర్ పరిశీలించారు.
డీఆర్డీఏ శకటానికి ప్రథమస్థానం: పది ప్రభుత్వ శాఖలు తాము సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న కార్యక్రమాలపై శకటాలను ప్రదర్శించాయి. డీఆర్డీఏ శకటం ప్రథమస్థానంలో నిలిచింది. ద్వితీయ బహుమతి విద్యాశాఖ, తృతీయ బహుమతి స్త్రీశిశు సంక్షేమశాఖ, ప్రత్యేక బహుమతులు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ శకటాలు గెలుచుకున్నాయి. అధికారులకు కలెక్టర్ బహుమతులను అందించారు.
సీఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సింహాద్రి ఎన్టీపీసీ జీజీఎం ఎస్.కె.సిన్హా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
అందరూ ఓటేస్తేనే.. ఐదేళ్ల అరాచక పాలన అంతం
[ 10-05-2024]
ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పోలింగ్ బృందాల తరలింపునకు.. 800 వాహనాలు
[ 10-05-2024]
పోలింగ్ బృందాలను ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ప్రచార ఘట్టం పరిసమాప్తం కానుంది. -
అసంపూర్తిగా ముగిసిన చర్చలు
[ 10-05-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం జరిపిన మలి దఫా చర్చలు గురువారం అసంపూర్తిగా ముగిశాయని పోర్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఉప్పెనలా రండి.. ఓటెత్తండి..!
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు. -
జగన్.. ఏంటీ కనికట్టు!!
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీలను శాటిలైట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఆ కాలనీల్లో నిర్మించిన ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. -
ఓటు వివరాలు ముందే తెలుసుకోండిలా!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈనెల 13న జిల్లాలోని ఒక లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఉద్యోగం వచ్చేంత వరకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి
[ 10-05-2024]
పెందుర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబుకు సబ్బవరం మండలం ప్రజలు గురువారం బ్రహ్మరథం పట్టారు. నారపాడు, నల్లరేగులపాలెం, బల్జిపాలెం, బాటజంగాలపాలెం, గణపతినగర్, అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం, పైడివాడ అగ్రహారం గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. -
వైఎస్సార్ బీమా.. ఏదీ ధీమా..
[ 10-05-2024]
కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
కేంద్రం సహకారంతో జిల్లా అభివృద్ధి: సీఎం రమేశ్
[ 10-05-2024]
కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఖాయమని, వారిద్దరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
దళితులకు అన్యాయం చేసిన వైకాపాను ఓడించాలి
[ 10-05-2024]
దళితులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళితసేన, ప్రజాసంఘాలతో కలసి మే 13న జరిగే ఎన్నికల్లో ఓడిస్తామని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో గందరగోళం
[ 10-05-2024]
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో చివరి రోజు చాలా మంది ఉద్యోగులు భారీగా ఓటు వేయడానికి తరలివచ్చారు. -
మున్సిపల్ ఉన్నతాధికారిపై ఈడీ కేసు నమోదు
[ 10-05-2024]
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (హైదరాబాద్) ఒక ప్రకటనలో తెలిపింది. -
మాజీ కౌన్సిలర్ దంపతుల ఓట్లు గల్లంతు..
[ 10-05-2024]
జీవీఎంసీ 82వ వార్డు శ్రీరామనగర్ కాలనీలో ఉంటున్న మాజీ కౌన్సిలర్ యర్రంశెట్టి లక్ష్మి పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. -
నిర్మాణాలు కుంగదీశావ్.. బతుకులు కూల్చేశావ్!
[ 10-05-2024]
భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు. లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. -
స్మార్ట్ బాదుడుకు రంగం ‘సిద్ధం’!
[ 10-05-2024]
‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’ -
అసత్యాల సారథి.. ఏదీ వారధి?
[ 10-05-2024]
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం