logo

మత్తు ఇంజక్షన్ల సరఫరాపై నిఘా

నగరంలో నిషేధిత మత్తు ఇంజక్షన్ల విక్రయాలు. దిగుమతి తీరుపై సెబ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దృష్టి సారించారు.

Published : 04 Feb 2023 05:07 IST

స్వాధీనం చేసుకున్న మత్తు ఇంజక్షన్లు (పాతచిత్రం)

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: నగరంలో నిషేధిత మత్తు ఇంజక్షన్ల విక్రయాలు. దిగుమతి తీరుపై సెబ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా ఈ మత్తు ఇంజక్షన్లను పశ్చిమ బెంగాల్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. నగరానికి చెందిన పలువురు విక్రయదారులకు పశ్చిమ బెంగాల్‌ సరఫరాదారులతో పరిచయాలు ఉండటంతో వారే స్వయంగా నగరానికి వచ్చి వీటిని అందజేయటం, వీలుకాని పక్షంలో తెలిసిన వారితో పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని నుంచి మరిన్ని వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై సెబ్‌ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని