logo

‘అదానీ గంగవరం’ పోర్టు వద్ద ఉద్రిక్తత

వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ‘అదానీ గంగవరం’ పోర్టు కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వివిధ విభాగాల కార్మికులు గేటు లోపల బైఠాయించి నినాదాలు చేశారు. శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బోనస్‌ ఇవ్వాలని కోరారు

Published : 01 Apr 2023 06:52 IST

వేతనాలు పెంచాలని కార్మికుల ఆందోళన
డీజిల్‌ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నిరసన తెలుపుతున్న గంగవరం పోర్టు కార్మికులు

గాజువాక, న్యూస్‌టుడే : వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ‘అదానీ గంగవరం’ పోర్టు కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వివిధ విభాగాల కార్మికులు గేటు లోపల బైఠాయించి నినాదాలు చేశారు. శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బోనస్‌ ఇవ్వాలని కోరారు. నిరసనకు హాజరైన కార్మికుడు పి.నూకరాజు తన వెంట తెచ్చుకున్న డీజిల్‌ను పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా న్యూపోర్టు పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌పై గతంలో ప్రశ్నించిన కొందరు కార్మికులను విధుల నుంచి తొలగించిన యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రతి కార్మికుడికి రూ.36 వేల వేతనం చెల్లించాలని, లేకపోతే వీఆర్‌ ప్రకటించి ఒక్కో కార్మికుడికి రూ.50 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు వివిధ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విధుల నుంచి తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని, ఏటా 20 శాతం బోనస్‌ చెల్లించాలని, ప్రత్యేక మెడికల్‌ పాలసీ ప్రకటించాలని.. తదితర 11 డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు.  పోర్టు యాజమాన్య ప్రతినిధులతో అఖిల పక్ష నాయకులు, పోర్టు కార్మిక సంఘాల నాయకులు చర్చలు కొనసాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని