సరైన తిండి లేదు.. చచ్చి బతికాం..!
‘పాకిస్తాన్లోని కరాచీ జైలు నుంచి బయట పడతామనుకోలేదు. నాలుగున్నరేళ్లు చీకటిలో మగ్గాం. అక్కడి భాష రాదు. జైలు అధికారులు ఏమి చెబుతున్నారో అర్థమయ్యేది కాదు.
పాకిస్తాన్ జైలు నుంచి బయటపడ్డ మత్స్యకారులు
సమావేశంలో మాట్లాడుతున్న జానకీరామ్, చిత్రంలో విశాఖకు చేరిన మత్స్యకారులు
వన్టౌన్, న్యూస్టుడే: ‘పాకిస్తాన్లోని కరాచీ జైలు నుంచి బయట పడతామనుకోలేదు. నాలుగున్నరేళ్లు చీకటిలో మగ్గాం. అక్కడి భాష రాదు. జైలు అధికారులు ఏమి చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. దేవుడి దయతో జైలు నుంచి విముక్తి కలిగింది. పాకిస్తాన్ నుంచి గుజరాత్, అక్కడి నుంచి విశాఖ చేరుకున్నాం’అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలపల్లి భాస్కర్రావు, తూ.గో. జిల్లా గజ్జికాయలపురం గ్రామానికి చెందిన మాదే అన్నవరం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం గ్రామం పసుపులంక గ్రామానికి చెందిన పి.నారాయణరావు పేర్కొన్నారు. వీరిని మంగళవారం ఆంధ్రప్రదేశ్ మర పడవల ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు వాసుపల్లి జానకీరామ్ విశాఖ తీసుకొచ్చారు. అనంతరం చేపలరేవులోని సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ ‘2018 నవంబరు 18న మేము గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ తీరంలో వేట సాగిస్తున్నాం. మా బోటు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిందని పాక్ కోస్టుగార్డు పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 మందిని పట్టుకున్నారు. వీరిలో 22 మంది నాలుగేళ్ల క్రితమే విడుదలయ్యారు. నేను ఒక్కడిని ఉండిపోయాను. వివిధ రకాల దౌత్య సంప్రదింపుల తర్వాత ఇటీవల నాతో పాటు తూ.గో., అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు మత్స్యకారులను విడుదల చేశారు’ అని చెప్పారు. తండ్రి రెండేళ్ల కిత్రం చనిపోయిన విషయం కూడా తనకు తెలియదని వాపోయారు. సరైన భోజనం పెట్టలేదని, అక్కడి జైళ్లు నరకానికి నకళ్లుగా ఉన్నాయన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చచ్చి బతికామని కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు భారతీయ మత్స్యకారులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు.
* పాక్ జైళ్ల నుంచి విడుదలైన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ మర పడవల ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు వాసుపల్లి జానకీరామ్ డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి బాధితులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించిందని చెప్పారు. అదే తరహాలో వీరికి ఇవ్వాలని కోరారు. మత్స్యకారులు ఈనెల 13న గుజరాత్కు చేరుకున్నారని, అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారని, పూర్తిగా కోలుకున్న తర్వాత విశాఖ తీసుకొచ్చామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
అందరూ ఓటేస్తేనే.. ఐదేళ్ల అరాచక పాలన అంతం
[ 10-05-2024]
ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పోలింగ్ బృందాల తరలింపునకు.. 800 వాహనాలు
[ 10-05-2024]
పోలింగ్ బృందాలను ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ప్రచార ఘట్టం పరిసమాప్తం కానుంది. -
అసంపూర్తిగా ముగిసిన చర్చలు
[ 10-05-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం జరిపిన మలి దఫా చర్చలు గురువారం అసంపూర్తిగా ముగిశాయని పోర్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఉప్పెనలా రండి.. ఓటెత్తండి..!
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు. -
జగన్.. ఏంటీ కనికట్టు!!
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీలను శాటిలైట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఆ కాలనీల్లో నిర్మించిన ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. -
ఓటు వివరాలు ముందే తెలుసుకోండిలా!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈనెల 13న జిల్లాలోని ఒక లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఉద్యోగం వచ్చేంత వరకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి
[ 10-05-2024]
పెందుర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబుకు సబ్బవరం మండలం ప్రజలు గురువారం బ్రహ్మరథం పట్టారు. నారపాడు, నల్లరేగులపాలెం, బల్జిపాలెం, బాటజంగాలపాలెం, గణపతినగర్, అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం, పైడివాడ అగ్రహారం గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. -
వైఎస్సార్ బీమా.. ఏదీ ధీమా..
[ 10-05-2024]
కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
కేంద్రం సహకారంతో జిల్లా అభివృద్ధి: సీఎం రమేశ్
[ 10-05-2024]
కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఖాయమని, వారిద్దరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
దళితులకు అన్యాయం చేసిన వైకాపాను ఓడించాలి
[ 10-05-2024]
దళితులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళితసేన, ప్రజాసంఘాలతో కలసి మే 13న జరిగే ఎన్నికల్లో ఓడిస్తామని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో గందరగోళం
[ 10-05-2024]
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో చివరి రోజు చాలా మంది ఉద్యోగులు భారీగా ఓటు వేయడానికి తరలివచ్చారు. -
మున్సిపల్ ఉన్నతాధికారిపై ఈడీ కేసు నమోదు
[ 10-05-2024]
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (హైదరాబాద్) ఒక ప్రకటనలో తెలిపింది. -
మాజీ కౌన్సిలర్ దంపతుల ఓట్లు గల్లంతు..
[ 10-05-2024]
జీవీఎంసీ 82వ వార్డు శ్రీరామనగర్ కాలనీలో ఉంటున్న మాజీ కౌన్సిలర్ యర్రంశెట్టి లక్ష్మి పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. -
నిర్మాణాలు కుంగదీశావ్.. బతుకులు కూల్చేశావ్!
[ 10-05-2024]
భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు. లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. -
స్మార్ట్ బాదుడుకు రంగం ‘సిద్ధం’!
[ 10-05-2024]
‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’ -
అసత్యాల సారథి.. ఏదీ వారధి?
[ 10-05-2024]
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం