ముగ్గురి పాలిట మృత్యువు
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది..
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనాల ఢీ
సాలూరు, జన్నివలసలో అలుముకున్న విషాదం
పురుషోత్తం, యశోద కృష్ణ (పాతచిత్రాలు), శ్రీను మృతదేహం
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. అప్పటికే ఇద్దరు కన్నబిడ్డల్ని పోగొట్టుకుని వేదనలో ఉన్న తల్లికి అండగా ఉన్న ఒక్క కుమారుడ్ని శాశ్వతంగా దూరం చేసింది...
రామభద్రపురం, సాలూరు, న్యూస్టుడే: సాలూరు-రామభద్రపురం 26వ జాతీయ రహదారిపై కొట్టక్కి వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సును తప్పించబోయే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రామభద్రపురం సీఐ తిరుమలరావు వివరాల మేరకు.. రామభద్రపురం మండలం జన్నివలసకు చెందిన జొన్నాడ పురుషోత్తం (25), గెద్ద రాంప్రసాద్, గణేష్లు ఒక ద్విచక్ర వాహనంపై సాలూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. వీరు కొట్టక్కి వంతెన వద్ద సాలూరు పట్టణానికి చెందిన గండుబోయిన యశోద కృష్ణ(25), జి. శ్రీను (47) బైక్ను ఢీకొన్నారు. ప్రమాదంలో పురుషోత్తం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీను, యశోదకృష్ణను సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి, రాంప్రసాద్, గణేష్ను బాడంగి సీహెచ్సీకి 108 వాహనాల్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను, యశోద కృష్ణ మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. దీనిపై రామభద్రపురం ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సాలూరు పట్టణ సీఐ, ఎస్ఐలు వాసునాయుడు, ఎస్వీ సురేష్, సీతారాం, సిబ్బంది క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు.
మృతదేహంపై పడి రోదిస్తున్న పురుషోత్తం తల్లిదండ్రులు
జీవనాధారం కోల్పోయారు..
జన్నివలస గ్రామానికి చెందిన పురుషోత్తం రాజమండ్రిలోని ఓ సీడ్ కంపెనీలో పనిచేస్తూ.. తల్లిదండ్రులు తౌడమ్మ, అప్పారావును పోషిస్తున్నాడు. కుమార్తెకు వివాహం చేయగా.. కుమారుడు ఇంటికి పెద్దదిక్కుగా ఉండేవాడని, ఇంటి దీపం ఆరిపోయిందని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. పురుషోత్తం రాజమహేంద్రవరం నుంచి ఇంటికి బైక్పై గురువారం వచ్చాడు. ఆ సమయంలో జన్నివలస గ్రామంలో డీఎస్పీ, సీఐలు రోడ్డు ప్రమాదాలు, ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. సాలూరుకు వెళ్లి వస్తానని చెప్పిన పురుషోత్తం మిత్రులతో కలిసి ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సాలూరు పట్టణం గొల్లవీధికి చెందిన అవివాహితుడు యశోద కృష్ణ తల్లిదండ్రులు చనిపోయారు. అక్క, ఇద్దరు సోదరులున్నారు. చికెన్ సెంటర్లో పనిచేస్తూ కుటుంబానికి సాయంగా ఉండేవాడు. కొద్ది సేపటి ముందే ఇంట్లోని పిల్లలు పానీపూరీ కావాలంటే ఇచ్చి, బయటికి వచ్చాడని.. తమ్ముడిని ఇలా విగతజీవిగా చూస్తామని అనుకోలేదని సోదరి, సోదరులు బోరున విలపించారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు
ఒంటరిగా మారిన తల్లి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనుకు తల్లి సూరమ్మ, ఇద్దరు సోదరులున్నారు. మూడేళ్ల కిందట ఇద్దరు కుమారులు అనారోగ్యంతో చనిపోయారు. ఉన్న ఒక్క కొడుకు శ్రీనును మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో తీసుకుపోయిందని ఆ తల్లి పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. శ్రీను భార్య అతనిని విడిచిపెట్టింది. సున్నం, పెయింటింగ్ పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.