సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోతే కఠిన చర్యలు
ప్రభుత్వ ఆదేశం మేరకు సీఎంఆర్ బియ్యం బకాయిల సేకరణకు పౌరసరఫరాల శాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. గడువు పెంచినా బియ్యం అప్పగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
మరిపెడ, న్యూస్టుడే: ప్రభుత్వ ఆదేశం మేరకు సీఎంఆర్ బియ్యం బకాయిల సేకరణకు పౌరసరఫరాల శాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. గడువు పెంచినా బియ్యం అప్పగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అవ్వడంతో అధికార యంత్రాంగం సంబంధిత మిల్లర్లపై ఒత్తిడి పెంచింది. జిల్లాలో గత ఏడాది గడువు ముగిసే నాటికి మూడు మిల్లులు బియ్యం అప్పగించలేదని గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సీఎంఆర్ ధాన్యం నిల్వల లెక్కలు తీశారు. కొన్ని చోట్ల నిల్వలు లేక పోవడంతో కొత్త ధాన్యాన్ని చూపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. గత యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా మిల్లులకు కేటాయించారు. జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోని మూడు మిల్లులు 1566.760 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ బకాయి ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత మిల్లర్లకు 25 శాతం జరిమానా విధించి 391.689 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన సదరు మిల్లర్లు జరిమానాతో కలిపి 1958.449 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉండగా 1574.600 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేశారు. మూడు మిల్లుల్లో ఓ మిల్లరు జరిమానాతో సహా బియ్యం అందజేశారు. సంబంధిత మిల్లర్లకు ప్రస్తుత ఖరీఫ్లో పీపీసీల నుంచి బియ్యం నిలిపివేసిన అధికారులు తొలుత జరిమానాతో సహా చెల్లించిన మిల్లరుకు ధాన్యం అందజేయాలని నిర్ణయించారు. అనంతరం ప్రభుత్వ చర్యలతో మిల్లర్లు నిబంధనల మేరకు బ్యాంకు గ్యారంటీ అందజేసి తిరిగి ధాన్యం పొందేందుకు ఉత్తర్వులు పొందినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆదేశం మేరకు.. : - నారాయణరెడ్డి, డీటీ, పౌరసరఫరాల శాఖ
నిబంధనల మేరకు మిల్లర్లు సకాలంలో బియ్యం అందజేయని వారికి హెచ్చరికలు జారీ చేశాం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు బకాయి ఉన్న మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని తిరిగి ధాన్యం అందజేసేందుకు అనుమతించింది. ఉల్లంఘనలు కొనసాగితే కఠిన చర్యలుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లులో కాషాయోత్సాహం
[ 09-05-2024]
మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి. -
ఎన్నికలకు పోలీసుల రక్షణ ఛత్రం
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
‘ప్రత్యేక త చాటాలి.. ఓటు మురవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి భారత ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పలు ప్రయోగాలు అమలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తోంది. -
చెయ్యెత్తి నినదించూ.. ఓటెత్తి జైకొట్టు
[ 09-05-2024]
‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం. -
నిబంధనల మేరకే ఈవీఎంల కమిషనింగ్
[ 09-05-2024]
ఎన్నికల నిబంధనల మేరకు ఈవీఎంల కమిషనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రత్యేక అధికారి నవీన్ విద్ది తెలిపారు. -
‘కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి’
[ 09-05-2024]
భారాస పదేళ్ల పాలనలో ఎన్నో పదవులు అనుభవించి, స్వలాభం కోసం పార్టీ మారి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. -
భారాసపై అవినీతి మరకలతోనే పార్టీ వీడాను..
[ 09-05-2024]
వరంగల్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నా కుమార్తె కడియం కావ్యను మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. -
ఆదరించండి.. అభివృద్ధి బాధ్యత నాదే
[ 09-05-2024]
పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. -
నాలుగో రోజు.. 431 మంది పోస్టల్ ఓటు వినియోగం
[ 09-05-2024]
నాలుగో రోజు బుధవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా 431 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.. -
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కండి
[ 09-05-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవ్వాలని రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపర్చిన పోరిక బలరాంనాయక్ను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
[ 09-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
[ 09-05-2024]
పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు వలస వచ్చిన ఆ కూలీ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
అంతర్గత కలహాలపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పరస్పర విమర్శలు చేసుకోవడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గడువు పెంపు
[ 09-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి గడువు ఈ నెల 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..