రూ.53 లక్షల ఇంధనం స్వాహా?
గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్య విభాగంలో ఇంధన కుంభకోణం బయటపడింది. ప్రాథమిక విచారణలో సుమారు రూ.53 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలింది. ఇందుకు బాధ్యుడిగా ఐదు రోజుల క్రితమే కమిషనర్ ప్రావీణ్య ప్రభుత్వ శానిటరీ జవాన్ రఘును సస్పెండ్ చేశారు. సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
న్యూస్టుడే, కార్పొరేషన్
రాంపూర్ డంపింగ్ యార్డు ముందు చెత్తను తరలించే వాహనాలు
గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్య విభాగంలో ఇంధన కుంభకోణం బయటపడింది. ప్రాథమిక విచారణలో సుమారు రూ.53 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలింది. ఇందుకు బాధ్యుడిగా ఐదు రోజుల క్రితమే కమిషనర్ ప్రావీణ్య ప్రభుత్వ శానిటరీ జవాన్ రఘును సస్పెండ్ చేశారు. సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అర్బన్ మలేరియా విభాగంలో కూడా డీజిల్, పెట్రోల్ దారి మళ్లినట్లుగా గుర్తించారు. ఇందుకు బాధ్యులైన వారిపై త్వరలో వేటుపడనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు, మూడు నెలల్లో వేలాది లీటర్ల డీజిల్ పక్కదారి పట్టినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ విచారణలో గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన శానిటరీ జవాన్ వెనుక ఎవరెవరున్నారు? ఎన్నేళ్లుగా ఇలా జరుగుతోంది? తదితర అంశాలపై లోతైన విచారణ చేపట్టాలని కమిషనర్ భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ కుంభకోణంపై విచారణకు ప్రత్యేకాధికారిని నియమించే అవకాశాలున్నాయి. శానిటరీ జవానే కాదు, కొందరు అధికారులు డీజిల్ కూపన్లను దుర్వినయోగ పర్చినట్లు తెలిసింది. వీటిపై విచారణ చేసే అవకాశాలున్నాయి.’
అందరికీ వాటాలు!
డీజిల్ కుంభకోణంలో ఒక్క శానిటరీ జవానే కాదని, కొందరు అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారుల పాత్ర కూడా ఉందని తెలిసింది. తొలుత ములుగురోడ్డు కూడలిలోని ప్రైవేటు పంపులో బల్దియా వాహనాలకు డీజిల్, పెట్రోలు పోసేవారు. అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి వరంగల్ కేంద్ర కారాగారం పెట్రోల్ పంపునకు మార్చారు. నాలుగేళ్లుగా ఇక్కడ గ్రేటర్ వరంగల్ వాహనాలకు ఇంధనం పోస్తున్నారు. ఇక్కడ కూడా పాత పద్ధతే. కిందిస్థాయి ఉద్యోగి నుంచి అధికారి వరకు అందరికీ వాటాలు అందుతున్నట్లు విచారణలో వెలుగుచూడటం నివ్వెర పరిచింది. లోతుగా విచారణ జరిపితే ‘పెద్ద తలల’ పాత్ర కూడా బయటపడే అవకాశం ఉంది.
అక్రమాలు ఇలా..
* ప్రజారోగ్య విభాగానికి చెందిన ప్రభుత్వ శానిటరీ జవాన్ 15 ఏళ్లుగా డీజిల్, పెట్రోల్ కూపన్లు రాస్తున్నారు. దీర్ఘకాలికంగా పాతుకుపోవడంతో యథేచ్చగా అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. కమిషనర్ ప్రావీణ్య ఆదేశంతో సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్ చెత్తను తరలించే వాహనాలకు కేటాయించిన ఇంధనం కూపన్లు పరిశీలించారు. మరమ్మతుల కోసం షెడ్డులో ఉన్న వాహనాలు రోజూ డీజిల్ వాడినట్లుగా కూపన్లు రాసినట్లు గుర్తించారు. ట్రాక్టర్లు, కంపాక్టర్లు, పొక్లెయిన్లు, డోజర్లు, స్వీపింగ్ మిషన్లు, స్వచ్ఛ ఆటోలకు పరిమితికి మించి ఇంధనం కేటాయించినట్లు తెలిసింది.
* పాతబస్తీ ప్రాంతంలో తిరుగుతున్న ఓ ట్రాక్టర్కు ఒకే రోజూ 100 లీటర్లు పోసినట్లు కూపన్ రాశారు. నిబంధనల ప్రకారమైతే ఒక ట్రాక్టర్కు మూడు రోజులకు 36 లీటర్ల డీజిల్ పోయాలి. ఒకే రోజు వంద లీటర్లు ఎలా పోశారనేది ఆరా తీస్తున్నారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో తిరిగే చెత్త వాహనాలకు పరిమితికి మించి డీజిల్ కూపన్లు రాశారని తెలిసింది.
* గ్రేటర్ వరంగల్కు చెందిన పొక్లెయిన్లు, డోజర్లకు ఎక్కువ డీజిల్ కేటాయించారు. కొందరు డ్రైవర్లతో శానిటరీ జవాన్కు దోస్తీ ఉందని తెలిసింది.
* బల్దియా వాహనాలకు కేటాయించిన డీజిల్నే కొందరు అధికారులు ప్రైవేటు వాహనాలకు వాడినట్లుగా తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం -
అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్
[ 10-05-2024]
దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు. -
ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి
[ 10-05-2024]
ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. -
విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!
[ 10-05-2024]
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. -
పైపైన పూడికతీత..ఇలాగైతే ముంచుతుంది నాలా!
[ 10-05-2024]
నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. -
కాంగ్రెస్, భాజపా దొందూ దొందే..
[ 10-05-2024]
ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. -
భారాస హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం
[ 10-05-2024]
పరకాల, గీసుకొండ, న్యూస్టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. -
మరో అయిదు బడుల్లో పీఎంశ్రీ శ్రీకారం
[ 10-05-2024]
విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకానికి ఎంపిక చేసింది. -
‘ఏ పార్టీలో ఉన్నా.. క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా’
[ 10-05-2024]
నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
దేశ సంపద అంబానీ, అదానీల చెంత..
[ 10-05-2024]
దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. -
మహిళలకు తోడూనీడ.. సఖి
[ 10-05-2024]
బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. -
రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. -
‘దేవుళ్లపై ఒట్లు వేస్తే ఓట్లు రాలవు’
[ 10-05-2024]
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. -
కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!
[ 10-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. -
శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 10-05-2024]
ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. -
సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?
[ 10-05-2024]
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? -
హవాలా కేసులో ఇద్దరి అరెస్టు
[ 10-05-2024]
వరంగల్ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్