బస్తీ పిల్లలకు స్వర్గధామాలు
పేదల బస్తీలంటే ఎటు చూసినా గుడిసెలు, మురికి కాలువలు కనిపిస్తాయి. ఇక్కడి వారికి మంచి ఆటస్థలాలు కూడా అందుబాటులో ఉండవు.
ఈనాడు, వరంగల్
వరంగల్ ఎంహెచ్ నగర్ పేదలబస్తీలో..
పేదల బస్తీలంటే ఎటు చూసినా గుడిసెలు, మురికి కాలువలు కనిపిస్తాయి. ఇక్కడి వారికి మంచి ఆటస్థలాలు కూడా అందుబాటులో ఉండవు. అలాంటిది ఆహ్లాదకరమైన ఆటమైదానాలను వారి కోసం సిద్ధం చేస్తోంది వరంగల్ మహానగరపాలక సంస్థ. వరంగల్, హనుమకొండల్లో ఇప్పటికే మురికివాడల పిల్లల కోసం అయిదారు పార్కులు సిద్ధమయ్యాయి. ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో పిల్లలు ఇందులో ఆడుకుంటున్నారు. వారికి ఈ పార్కులు స్వర్గధామంలా ఉన్నాయి.
గతేడాది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా వంద ఆకర్షణీయ నగరాల్లో ‘నర్చరింగ్ నైబర్హుడ్ ఛాలెంజ్’ కింద ఒక పోటీ పెట్టింది. తల్లులు, పిల్లలకు (మాతాశిశు) ఆహ్లాదం పంచేలా ఆయా నగరాల్లో పార్కులు, ఆటస్థలాల అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యం. ఈ క్రమంలో వరంగల్ ఎంహెచ్ నగర్, కాశీబుగ్గ క్రిస్టియన్ కాలనీల్లోని చెత్తాచెదారంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసుకొని పిల్లలు ఆడుకునేలా ఉద్యానవనంగా మార్చారు. దీనికి ‘చిట్టి పార్కు’లుగా నామకరణం చేశారు. వరంగల్ మహానగరపాలక సంస్థ 44, 72 గంటల్లో వీటి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా పది నగరాలు ఈ పోటీలో విజేతలుగా నిలిస్తే అందులో వరంగల్ ఒకటి.
పిల్లలను ఆకట్టుకునేలా..
గ్రేటర్ వరంగల్ అధికారులు నగరంలోని మరికొన్ని మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో పిల్లలకు ఆట స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ మైసయ్య నగర్లో చిన్నారుల కోసం మైక్రో పార్కును నిర్మించారు. గుండుబావిలో సైతం పిల్లల కోసం మరొకటి తీర్చిదిద్దారు. వీటి గోడలపై రంగురంగుల అక్షరాలు, బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లలు ఆడుకునే సరదా రైడ్లు, చిన్న వ్యాయామాలు చేసి పరికరాలను ఏర్పాటుచేశారు. వీటితోపాటు, హనుమకొండ శ్రీనగర్కాలనీలో ఏర్పాటుచేసిన పార్కులో పిల్లలు కాసేపు ఆడుకున్నాక అక్కడే చదువుకునే వసతులు కల్పించారు. రాజీవ్నగర్ పార్కులో రాత్రి పది గంటల వరకు పరిసరాల్లోని చిన్నారులు స్వేచ్ఛగా ఆడేందుకు హైమాస్ట్ లైట్లను ఏర్పాటుచేసి, ఆట వస్తువులు అందుబాటులో పెట్టింది బల్దియా. ఉదయం వేళ బడికి వెళ్లే తొందరలో పార్కుకు వచ్చే వీల్లేకపోయినా, సాయంత్రం నుంచి రాత్రి వరకు స్వేచ్ఛగా ఆడుకునేందుకు చిన్నారుల కోసం నైట్ పార్కులను కూడా సిద్ధం చేస్తున్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ పథకం కింద ఉన్నందున హనుమకొండ పబ్లిక్గార్డెన్ను సైతం స్మార్ట్సిటీ నిధులతో తీర్చిదిద్ది రాత్రివేళ చిన్నారులు స్వేచ్ఛగా గడిపే వసతులు కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం -
అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్
[ 10-05-2024]
దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు. -
ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి
[ 10-05-2024]
ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. -
విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!
[ 10-05-2024]
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. -
పైపైన పూడికతీత..ఇలాగైతే ముంచుతుంది నాలా!
[ 10-05-2024]
నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. -
కాంగ్రెస్, భాజపా దొందూ దొందే..
[ 10-05-2024]
ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. -
భారాస హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం
[ 10-05-2024]
పరకాల, గీసుకొండ, న్యూస్టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. -
మరో అయిదు బడుల్లో పీఎంశ్రీ శ్రీకారం
[ 10-05-2024]
విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకానికి ఎంపిక చేసింది. -
‘ఏ పార్టీలో ఉన్నా.. క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా’
[ 10-05-2024]
నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
దేశ సంపద అంబానీ, అదానీల చెంత..
[ 10-05-2024]
దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. -
మహిళలకు తోడూనీడ.. సఖి
[ 10-05-2024]
బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. -
రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. -
‘దేవుళ్లపై ఒట్లు వేస్తే ఓట్లు రాలవు’
[ 10-05-2024]
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. -
కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!
[ 10-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. -
శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 10-05-2024]
ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. -
సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?
[ 10-05-2024]
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? -
హవాలా కేసులో ఇద్దరి అరెస్టు
[ 10-05-2024]
వరంగల్ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!