చరితకు వేదిక.. చైతన్య ప్రతీక
కాకతీయుల ఘన వారసత్వ సంపద.. జాతీయ, రాష్ట్రస్థాయి పేరెన్నికగల విశ్వవిద్యాలయాలు, వైద్య, విద్యా సంస్థలు.. దక్షిణ, ఉత్తర భారతాన్ని కలిపే రోడ్డు, రైలు మార్గాలు.. చైతన్యంతో కూడిన రాజకీయాలు..
నియోజకవర్గం ముచ్చట
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్టుడే
కాకతీయుల ఘన వారసత్వ సంపద.. జాతీయ, రాష్ట్రస్థాయి పేరెన్నికగల విశ్వవిద్యాలయాలు, వైద్య, విద్యా సంస్థలు.. దక్షిణ, ఉత్తర భారతాన్ని కలిపే రోడ్డు, రైలు మార్గాలు.. చైతన్యంతో కూడిన రాజకీయాలు.. ఉద్దండులైన నేతలు.. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాలు.. ఉమ్మడి జిల్లాకు కేంద్ర బిందువైన హనుమకొండ ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉంది. 1952 నుంచి 2018 వరకు నియోజకవర్గ అవలోకనం చేసుకుందాం...
పేరెలా వచ్చిందంటే......
రాష్ట్ర కూటులకు సామంతుడిగా ఉన్న కాకతీయ రాజు మొదటి రుద్రదేవుడు క్రీ.శ. 1162లో హనుమకొండ కేంద్రంగా స్వాతంత్య్రం ప్రకటించుకున్నట్లు వేయిస్తంభాల ఆలయ శాసనం తెలుపుతోంది. అయితే అంతకన్నా ముందు అనుమడు, కొండడు అనే అన్నదమ్ములు ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల వారిపేరు మీదుగా అనుమకొండ వెలిసినట్లు చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాక ఈ ప్రాంత విశిష్టత పెరిగింది. కాలక్రమంలో హనుమకొండగా పిలువబడుతోంది. ఈ ప్రాంతం పూర్వం తెలంగాణలో జైన మతానికి కేంద్రంగా ఉండేదని చారిత్రక ఆధారాలు, పద్మాక్షిగుట్ట శాసనం చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో శైవ మతం వర్ధిల్లింది.
అప్పుడు హనుమకొండ.. ఇప్పుడు వరంగల్ పశ్చిమ..
1952లో ఏర్పడిన హనుమకొండ నియోజకవర్గానికి 2004లో జరిగిన చివరి ఎన్నిక వరకు పదిసార్లు ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్, కాంగ్రెస్, భాజపా, తెదేపా, తెరాస పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. 1952లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో కమ్యూనిస్టులు పీడీఎఫ్ పార్టీ పేరుతో పోటీ చేశారు. అలా మొదటి ఎమ్మెల్యేగా పెండ్యాల రాఘవరావు ఎన్నికయ్యారు. ఈయన ఇదే సమయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా కూడా పోటీ చేసి ఏకకాలంలో మూడు స్థానాల నుంచి ఎంపిక య్యారు. ఎమ్మెల్యే పదవులను వదులుకొని ఎంపీగా కొనసాగారు. 2004లో చివరిసారి మందాడి సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో హనుమకొండ రద్దై వరంగల్ పశ్చిమ నియోజకవర్గంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారాసగా పేరు మారిన తెరాస నుంచి దాస్యం వినయ్భాస్కర్ ఎన్నికవుతూ వస్తున్నారు. అయిదోసారి ఆ పార్టీ తరఫున ఆయనే తలపడుతున్నారు.
మారుతూ వచ్చింది..
- 1952లో మొదట హనుమకొండ నియోజకవర్గంగా ఏర్పడి తర్వాత హసన్పర్తి, ధర్మసాగర్ నియోజకవర్గాలుగా మారి అనంతరం మళ్లీ హనుమకొండగా మారింది. మళ్లీ 2009లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.
- 2004లో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థిగా గెలిచిన మందాడి సత్యనారాయణరెడ్డి అసమ్మతి నేతగా ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. తరవాత హైకోర్టు స్టేతో నెల రోజుల పాటు పదవిలో కొనసాగినా అనంతరం మందాడికి వ్యతిరేక తీర్పు రావడంతో పదవి కోల్పోయారు.
- హనుమకొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారిలో హయగ్రీవాచారి, పీవీ రంగారావు, సంగంరెడ్డి సత్యనారాయణ, దాస్యం ప్రణయ్భాస్కర్ మంత్రులుగా పని చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్