logo

కానిస్టేబుల్‌ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

కానిస్టేబుల్‌ ఉద్యోగం దక్కడంలేదని  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్‌ కథనం ప్రకారం.. హసన్‌పర్తి మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన ఆకుల దేవేందర్‌గౌడ్‌, భారతి దంపతుల కుమారుడు ఆకుల రంజిత్‌ (30) డిగ్రీ పూర్తి చేశారు.

Published : 16 Apr 2024 04:54 IST

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: కానిస్టేబుల్‌ ఉద్యోగం దక్కడంలేదని  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్‌ కథనం ప్రకారం.. హసన్‌పర్తి మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన ఆకుల దేవేందర్‌గౌడ్‌, భారతి దంపతుల కుమారుడు ఆకుల రంజిత్‌ (30) డిగ్రీ పూర్తి చేశారు. 2022లో కానిస్టేబుల్‌ నియామక నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి మూడుసార్లు దరఖాస్తు చేశారు. ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధిస్తూ రాత పరీక్షల్లో వెనుకబడిపోయారు. దీంతో రంజిత్‌ నాలుగు నెలలుగా ముభావంగా ఉండసాగారు. సోమవారం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సరికి రంజిత్‌ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని