ఇంధనం బల్దియాదే తాగేద్దాం!
గ్రేటర్ వరంగల్ బల్దియాలో ఇంధన దుర్వినియోగం సర్వసాధారణమైంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు వింగ్ అధికారులు తాము వాడుతున్న అద్దె కార్లకు సైతం నిబంధనలకు విరుద్ధంగా గ్రేటర్ వరంగల్ పెట్రోల్ వాడుతున్నారు.
పప్పుబెల్లంలా పెట్రోల్ కూపన్ల పంపిణీ
కార్పొరేషన్, న్యూస్టుడే
'
గ్రేటర్ వరంగల్ బల్దియాలో ఇంధన దుర్వినియోగం సర్వసాధారణమైంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు వింగ్ అధికారులు తాము వాడుతున్న అద్దె కార్లకు సైతం నిబంధనలకు విరుద్ధంగా గ్రేటర్ వరంగల్ పెట్రోల్ వాడుతున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన పాలకవర్గం, కార్పొరేటర్లు మౌనంగా ఉండి పోతున్నారు. గ్రేటర్ వరంగల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇంధన కూపన్ల పంపిణీపై ప్రత్యేక కథనం..
బల్దియా అధికారులు కొందరు మనల్ని ఎవరడుగుతారులే అన్నట్లుగా పెట్రోల్ కూపన్లను ఫలహారంలా పంచేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు వీటిని కేటాయించాల్సి ఉండగా పక్కదారి పడుతున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులు తప్పు చేస్తే దండించాల్సిన ఓ అధికారే ఇంధనాన్ని క్యాన్లలో నింపుకెళ్తున్నారు. అధికారుల ఇళ్లలో పనిచేసే కార్మికులు, అద్దె కార్లు నడిపే ప్రైవేటు జవాన్లు, అర్హత లేని ఉద్యోగుల ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ నింపుతున్నారు.
ఇవిగో సాక్ష్యాలు..
- వరంగల్ ప్రాంతంలో పనిచేసే ఓ కార్మికుడు రోజూ ఉదయం బయోమెట్రిక్ అటెండెన్సు వేసి ఓ అధికారి ఇంటికి పనికెళ్తున్నాడు. పిల్లలను స్కూల్ దగ్గర దించడం, తీసుకురావడం ఆయన డ్యూటీ. అలాగే ఇంట్లో సరకులు, ఇతర పనులు చేస్తాడు. ఇతనికి నెలకు 10 లీటర్ల పెట్రోల్ కూపన్ ఇస్తున్నారని తెలిసింది.
- ఓ వింగ్ అధికారి అద్దె కారును ప్రైవేటు జవాన్లు నడుపుతున్నారు. వీరికి పెట్రోల్ కూపన్ జారీ చేస్తున్నారు.
- మరో అధికారి తమ ఇంట్లోని సొంత వాహనాలకు బల్దియా పెట్రోల్ వినియోగిస్తున్నారు.
- ఇంజినీరింగ్ విభాగంలో కొందరు ఉద్యోగులు పెట్రోల్ కూప్లను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
నిబంధనలు ఉల్లంఘన ఇలా..
శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, టౌన్ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు చైన్మెన్లు, ఇంజినీరింగ్ విభాగంలో ఏఈలు, లైన్మెన్లు, పన్నుల విభాగంలో బిల్కలెక్టర్లు, అర్బన్ మలేరియా విభాగంలో హెల్త్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, తదితర క్షేత్రస్థాయి ఉద్యోగులకు నెలకు 10, 15, 20 లీటర్ల చొప్పున పెట్రోల్ కూపన్లు జారీ చేస్తున్నారు. వీటిని రాసే అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అర్హతలేని వారికి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.
నిబంధనల ప్రకారం సదరు ఉద్యోగి రోజువారీగా పర్యటించే వివరాల డైరీ పరిశీలించిన తర్వాతే కూపన్లు ఇవ్వాలి. ఈ విధానం అమలుకావడం లేదు. కొందరు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. రోజూ వారీ పర్యటన వివరాల నమోదు పాటించడం లేదు. నిబంధనలు పరిశీలించకుండానే కూపన్లు జారీ చేస్తున్నారని తెలిసింది.
కమిషనర్ దృష్టికి..
పెట్రోల్ కూపన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఆ మేరకు ఇటీవల హనుమకొండ బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డులో పార్కింగ్ చేసిన పొక్లెయిన్ నుంచి డీజిల్ అపహరించిన ఒప్పంద డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయడానికైనా ఎలా రావాలి...!
[ 30-04-2024]
తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు -
వరంగల్ ప్రధాన న్యాయమూర్తిగా నిర్మలాగీతాంబ
[ 30-04-2024]
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వలగూడం బడిగేలి నిర్మలాగీతాంబ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని సిటీ స్మాల్ కాజెస్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె బదిలీపై జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘భారాస, భాజపాలు తోడు దొంగలు’
[ 30-04-2024]
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాసలు తోడుదొంగ పార్టీలని, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు -
‘లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూత’
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూతపడడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
కొడకండ్లకు మినీ టెక్స్టైల్ పార్క్ తెస్తా
[ 30-04-2024]
చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి... పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్షో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. -
భువనగిరి బరిలో 39 మంది
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు. -
నీటి కుంట.. తీరును తంటా!
[ 30-04-2024]
మానవుడి అవసరాలకు మించి అడవులను నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిని కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
‘ఈ’ సైకిల్ భళా..!
[ 30-04-2024]
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థి. మండలంలోని గోపాలపురానికి చెందిన కాముని హరీష్ గార్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. -
రాత్రిపూటా నిప్పుల కుంపటే!
[ 30-04-2024]
ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది -
రాతియుగం నాటి కంకణ శిల లభ్యం
[ 30-04-2024]
సుమారు ఆరు వేల ఏళ్ల నాటి అపురూపమైన కొత్త రాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపురం గ్రామంలో కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చిడం రవి తెలిపారు -
బరి గీశారు.. గురి ఎవరిదో..!
[ 30-04-2024]
‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరంగల్ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’ -
మరోసారి మోదీ ప్రభుత్వం ఖాయం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు. -
అయిదుశాతం రాయితీకి చివరి అవకాశం
[ 30-04-2024]
ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులకు వరంగల్ నగర ప్రజల నుంచి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం వరకు సుమారు రూ.18 కోట్ల పైన వసూలైనట్లు బల్దియా పన్నుల విభాగం అధికారులు తెలిపారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా అప్రమత్తత అవసరం
[ 30-04-2024]
వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు. -
కెప్టెన్ ఇంటి నుంచి ఖమ్మం ప్రచారానికి కేసీఆర్
[ 30-04-2024]
వరంగల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి హంటర్రోడ్లోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!