ప్రమాదం పొంచి ఉంది.. పనులు ప్రారంభించండి..!
ఏటా వానాకాలంలో గోదావరి వరదలతో మన్యంలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఇక్కడ వరద ప్రవాహంలో కనిపిస్తున్న విద్యుత్తు నియంత్రిక వాజేడు మండల పరిధి జంగాలపల్లి గ్రామంలోనిది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతికి ముంపునకు గురికావడంతో.. ఆయా గ్రామాల్లో అంధకారం అలుముకుంది.
వాజేడు (ములుగు జిల్లా), న్యూస్టుడే: ఏటా వానాకాలంలో గోదావరి వరదలతో మన్యంలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాజేడు మండలకేంద్రం నుంచి ధర్మారం విద్యుత్తు ఉప కేంద్రానికి కరెంటు సరఫరా జరిగే స్తంభాలన్నీ వానాకాలంలో వరద నీటిలో ముంపునకు గురవుతుండటంతో.. మండల పరిధిలోని సుమారు 30 గ్రామాలకు సరఫరా నిలిచిపోతుంది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. ఏడాది కాలంగా పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
ప్రాణాలకు తెగించి టీ రెయిజర్ల ఏర్పాటు
- గోదావరి వరదల్లో కరెంటు తీగలు మునిగిపోతుండటంతో.. సరఫరాకు ఆటంకం కలుగుతుంది. వరదల సమయంలో విద్యుత్తు సిబ్బంది నావలపై ప్రాణాలకు తెగించి ఆయా ప్రాంతాలకు చేరుకుని టీ రెయిజర్లను ఏర్పాటు చేయాల్సివస్తోంది. ఇవి ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ వరదల సమయంలో సరఫరాకు అంతరాయం తప్పడం లేదు.
- పరీక్షలు, పంటల సేద్యం సమయంలో స్తంభాలను ఏర్పాటు చేస్తే సాగుకు ఇబ్బందులు తలెత్తుతాయని పనులు చేపట్టలేదు. ప్రస్తుతం పంటలు పూర్తయినా కనీస ప్రయత్నాలు జరగడం లేదు. ఈ ఏడాది విద్యుత్తు సరఫరాలో అంతరాయం తప్పేటట్లు లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలోనే పనులు పూర్తిచేస్తేనే రానున్న వర్షాకాలంలో సరఫరాకు ఇబ్బందులు ఉండవు.
వాజేడు మండలం గుమ్మడిదొడ్డి రోడ్డు ఆయిల్ బంకు సమీపంలో గతేడాది భారీ వర్షాలకు వరద ప్రవాహంలో తేలియాడిన విద్యుత్తు తీగలు
ఎత్తయిన స్తంభాలు..
వాజేడు నుంచి గుమ్మడిదొడ్డి మార్గంలో స్తంభాలు పూర్తిగా వరదలో ఉండిపోతుండటంతో.. చాలా ఎత్తులో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. 2022లో అధికారులు ఎత్తయిన స్తంభాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. సుమారు రూ.60 లక్షల అంచనాతో పనులు చేపట్టేందుకు విద్యుత్తు శాఖ నిధులు మంజూరు చేసింది. ముంపు ప్రాంతాల్లో వేసేందుకు 13 మీటర్ల పొడవైన 27 స్తంభాలను ఆయా ప్రాంతాలకు తరలించి ఏడాది పూర్తయినా నేటి వరకు పనులు మొదలు పెట్టలేదు. ముంపు ప్రాంతాలతోపాటు మధ్యలో మరో 30 స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈనెలలో పనులు ప్రారంభిస్తాం..
- అర్షద్ అహ్మద్, ఏఈ
వర్షాకాలానికి ముందుగానే పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఈనెలలో పనులు ప్రారంభిస్తాం. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్