నీటి ఫిర్యాదులకు స్పందన కరవు!
నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
33వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోట చిన్న బ్రిడ్జి కాలనీవాసులు గతనెలలో చేసిన ఫిర్యాదు
కార్పొరేషన్, న్యూస్టుడే: నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటి సరఫరాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రేటర్ వరంగల్ ప్రత్యేకంగా సెల్ నంబరు 720790 08583 అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు అంతర్జాలం ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతంలోని పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నా.. పరిష్కారాలు మాత్రం అంతంత మాత్రమేనని ప్రజలంటున్నారు. కొందరు ఏఈలు ఫిర్యాదులపై స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.
పాతబస్తీలోని 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోట చిన్నబ్రిడ్జి సమీప కాలనీ ఇంటి నంబరు 16-01-321/1 నుంచి వరుసగా 20 ఇళ్లకు ఆరునెలలుగా తాగునీటి సరఫరా కావడం లేదు. చిన్నబ్రిడ్జి వద్ద డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ ఇంటర్ కనెక్షన్ పనులు చేయడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మార్చి 19న జీడబ్ల్యూఎంసీ వెబ్సైటు అంతర్జాలంలో ప్రజలు ఫిర్యాదు చేశారు. ఏఈ ముజమ్మిల్తో పలుమార్లు చరవాణి ద్వారా మాట్లాడారు. కొత్తగా ప్రారంభించిన మొబైల్ నంబరుకు శివనగర్, చింతల్, ఖిలావరంగల్ తూర్పు కోట, రామన్నపేట, దేశాయిపేట ప్రాంతాల్లో నీటి సరఫరాపై ఫిర్యాదులు వచ్చాయి. హనుమకొండ ప్రాంతంలో కొత్తూరుజెండా, పోచమ్మకుంట, కుమార్పల్లి, బాలసముద్రం, పద్మాక్షి కాలనీ, కాజీపేట దర్గా, ప్రగతినగర్, సొమిడి, డీజిల్ కాలనీల్లో తాగునీటి సరఫరా సరిగాలేదని కాలనీవాసులు ఫిర్యాదులు చేశారు.
క్షేత్రస్థాయికెళ్లని ఏఈలు
నగరంలోని 66 డివిజన్లలో తాగునీటి సరఫరాను ఏఈలు దగ్గరుండి పర్యవేక్షించాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది అసిస్టెంట్ ఇంజినీర్లు(ఏఈలు) క్షేత్రస్థాయికెళ్లడం లేదని తెలిసింది. మొబైల్ యాప్లో వచ్చినవి, అంతర్జాలం ద్వారా వచ్చిన ఫిర్యాదులు తేలిగ్గా తీసుకుంటున్నారు. కిందిస్థాయి వర్క్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లకు అప్పగిస్తున్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కొందరు ఏఈలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు