వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది.
యుగంధర్ (పాత చిత్రం)
జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్టుడే: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మైసన్నగూడెం గ్రామానికి చెందిన నులకాని సత్యనారాయణ, యుగంధర్(27) తండ్రీకొడుకులు. వీరు వ్యవసాయ భూమిలో షెడ్లు నిర్మించి బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నారు. మంగళవారం కోళ్ల ఫారాల వద్దకు వెళ్లారు. కోళ్లకు నిర్మించిన రేకుల షెడ్డుపైన స్ప్రింక్లర్లు(డ్రిప్ గొట్టాలు) పని చేయక పోవడంతో సరి చేసేందుకు యుగంధర్ షెడ్డుపైకి ఎక్కాడు. షెడ్డు పై నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్తు తీగలు అతడికి తగలడంతో యుగంధర్ విద్యుదాఘాతానికి మృతి చెందాడు. తండ్రి సత్యనారాయణ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకకు చేరుకుని.. విద్యుత్తు నిలిపేసిన అనంతరం యుగంధర్ మృతదేహన్ని కిందకు దించారు.
కారు ఢీకొని బాలిక మృతి
బుంగ సంధ్య (పాత చిత్రం)
భీమడోలు, న్యూస్టుడే: నాన్న ఇచ్చిన డబ్బులతో ఐస్క్రీమ్ తిందామని వెళ్లిన ఆ చిన్నారి అనూహ్యంగా మృత్యువాత పడింది. భీమడోలు మండలం లక్ష్మీపురం వద్ద మంగళవారం కారు ఢీకొని బుంగ సంధ్య (8) చనిపోయింది. ఎస్సై చావా సురేష్ కథనం మేరకు.. ద్వారకాతిరుమల మండలం శరభాపురం గ్రామానికి చెందిన బుంగా అశోక్కుమార్ కుటుంబం లక్ష్మీపురంలోని చేపల చెరువు వద్ద కాపలా ఉంటోంది. వీరి కుమార్తె సంధ్య ఐస్క్రీమ్ కోసం వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా గుండుగొలను వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలికను వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరు మృతి
భీమడోలు, న్యూస్టుడే: భీమడోలు పోలీసు స్టేషన్ పరిధిలోని కొండ్రెడ్డినగర్, లైన్ గోపాలపురం గ్రామాల మధ్య మోటారు సైకిల్ అదుపు తప్పిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. గుడివాడ సమీపంలోని బేతవోలుకు చెందిన తాపీ పని చేసుకుంటున్న పరిటాల రాజు (20), బండి సంజయ్, తెల్లం గౌతమ్ మోటారుసైకిల్పై రాజమహేంద్రవరంలో స్నేహితుడి వివాహానికి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున తిరిగి గుడివాడ వెళ్తుండగా కొండ్రెడ్డినగర్ సమీపంలోకి వచ్చేసరికి నిద్రమత్తులో వాహనాన్ని అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో పరిటాల రాజు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన సంజయ్, గౌతమ్లు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చెరువులో పడి అసోం రాష్ట్ర వాసి
దెందులూరు, న్యూస్టుడే: దెందులూరు మండలం కేదవరంలో ప్రమాదవశాత్తు చేపల చెరువులో పడి కె.చరణ్(55) మృతి చెందాడని ఎస్ఐ వీర్రాజు తెలిపారు.అసోం రాష్ట్రం సోనిత్పూర్ జిల్లా హత్కేరిపార గ్రామానికి చెందిన చరణ్.. ఇక్కడి చేపల చెరువుపై మేతలు కడుతూ జీవనోపాధి పొందుతున్న కూతురు, అల్లుడు వద్దకు ఎనిమిది నెలలు కిందట వచ్చారు. సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోగా చెరువు వద్ద ఉన్న జనరేటర్ వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి చెరువులో పడిపోయాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా చెరువులో అతడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. కుమార్తె బి.ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.
అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ కూలీ మృతి
ముదినేపల్లి, న్యూస్టుడే: కూలిపనికి వెళ్లిన వ్యక్తి రహదారి పక్కన విగతజీవిగా పడిన ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొర్రగుంటపాలెంకు చెందిన కాట్రు కృష్ణ (60) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం పొలంలో పనిచేసేందుకు ఇంటినుంచి వెళ్లిన కృష్ణ ఎంతకీ తిరిగి రాలేదు. అతని ఆ చూకీ కోసం భార్య మేరీగ్రేస్, బంధువులు గాలించగా గ్రామంలోనే రహదారి పక్కన మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. శరీరంపై గాయాలుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షణ్ముఖ సాయి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు చనిపోయారా, ఎవరైనా దాడి చేయడంతో మృతిచెందారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేపట్టారు.
చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
ద్వారకాతిరుమల, న్యూస్టుడే: మద్యం అనుకుని పొరపాటున పురుగుల మందు తాగిన ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందారని ద్వారకా తిరుమల పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. మహదేవపురానికి చెందిన కేతి సత్యనారాయణ(77) ఈ నెల 3న మద్యం అనుకుని పొరపాటున పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భీమడోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మరణించారు. మృతుడి కుమార్తె పిల్లి కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
వడగాడ్పులకు గుర్తు తెలియని వ్యక్తి మృతి
భీమడోలు, న్యూస్టుడే: వడగాడ్పుల ప్రభావానికి గురై గుర్తు తెలియని వ్యక్తి భీమడోలులోని సంతమార్కెట్ కూడలిలో మంగళవారం మృతి చెందాడు. సుమారు 60 ఏళ్ల వయసున్న ఇతన్ని యాచకుడిగా భావిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై విచారణ చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఠాగూర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన
[ 26-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. -
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?